టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా సూపర్ స్టార్ మహేష్ బాబు, కొరటాల శివ ల క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన భరత్ అనే నేను సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ. కాగా ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో హీరోయిన్ గా కియారాకు టాలీవుడ్ లో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు దక్కాయి. అలానే ఆకట్టుకునే అందంతో పాటు అలరించే అభినయం కూడా కియారాకు మరింత కలిసి వచ్చింది. ఇక ఆ తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన వినయవిధేయ రామ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన కియారా, ఊహించని రేంజ్ లో ఆ సినిమా ఘోరంగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో కొంత ఢీలా పడింది. 

 

అక్కడి నుండి పూర్తిగా బాలీవుడ్ కే పరిమితం అయిన కియారకు ఇప్పటివరకు మరొక టాలీవుడ్ ఛాన్స్ రానే లేదు. ఇకపోతే గత కొద్దిరోజలుగా పలు టాలీవుడ్ వర్గాల నుండి వినపడుతున్న వార్తలను బట్టి కియారా అద్వానీ, అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. ముందుగా కీర్తి సురేష్, కియారా ల మధ్య కొంత పోటీ జరిగిందని, అయితే చివరిగా హీరోయిన్ ఛాన్స్ మాత్రం కియారా నే వరించినట్లు చెప్తున్నారు. ఇకపోతే నేడు ఆమెకు మరొక సినిమాలో కూడా నటించే అద్భుతమైన ఛాన్స్ దక్కినట్లు లేటెస్ట్ టాక్. అతి త్వరలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కలయికలో తెరకెక్కనున్న అయినను పోయిరావలె హస్తినకు సినిమలో హీరోయిన్ గా కియారా నే ఎంపిక చేసిందట సినిమా యూనిట్. 

 

వాస్తవానికి గత కొద్దిరోజులుగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాలో హీరోయిన్ కోసం పలువురు భామలను సంప్రదించడం, చివరకు కియారా నే తమ సినిమాలోని పాత్రకు సరిగ్గా సరిపోతుందని భావించి ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు. ప్రస్తుతం ఆమెకు కొన్ని బాలీవుడ్ ప్రాజక్టులు ఉన్నప్పటికీ, వాటితో పాటు ఈ రెండు సినిమాలు కూడా చేయడానికి కియారా కూడా డేట్స్ అడ్జస్ట్ చేసేందుకు సిద్దమైందట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ న్యూస్ కనుక నిజం అయితే మాత్రం ఏకంగా ఇద్దరు బడా హీరోల సరసన ఛాన్స్ కొట్టిన కియారా రొట్టె విరిగి నేతిలో పడ్డట్లే.....!!!

మరింత సమాచారం తెలుసుకోండి: