టాలీవుడ్ లో ఆచార్య సినిమా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఏదోక చర్చ వస్తూనే ఉంది. సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారు అనేది ముందు నుంచి కూడా ఆసక్తి ఉంది. ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ ని ఎంపిక చేసారు అనే ప్రచారం అయితే జరుగుతుంది గాని ఆమె నటిస్తుందా లేదా అనేది తెలియడం లేదు. ఇక ఈ సినిమాలో విద్యా బాలన్ ని తీసుకునే అవకాశం ఉందని కూడా అన్నారు. అంత‌కు ముందు ఈ సినిమాలో చిరు ప‌క్క‌న త్రిష‌ను హీర‌యిన్ గా సెల‌క్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఏం జ‌రిగిందో ఏమో గాని త్రిష తాను ఈ సినిమా నుంచి త‌ప్పుకున్న‌ట్టు నేరుగానే ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చింది.

 

దీంతో చిరు సినిమాలో హీరోయిన్ వ్య‌వ‌హారం ఓ ప‌ట్టాన తేలేలా లేదు. ఈ లోగా క‌రోనా వ‌చ్చి ప‌డ‌డంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది. ఇది పక్కన పెడితే ఈ సినిమాలో ఇప్పుడు ఇద్దరు సీనియర్ హీరోయిన్ లను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది. కచ్చితంగా ఈ సినిమాలో అనుష్క కూడా ఉంటుందని సమాచారం. మార్కెట్ ని దృష్టి లో పెట్టుకుని ఈ సినిమాలో మరో హీరోయిన్ ని కూడా తీసుకునే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆమెను ఇప్పటికే అడిగారని ఆమె అందుకు ఓకే కూడా చెప్పారని సమాచారం. 

 

వచ్చే ఏడాది ఈ సినిమా కచ్చితంగా ఎలా అయినా విడుదల చెయ్యాలని చిరంజీవి భావిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా వైడ్ గా విడుదల చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. కాని సైరా సినిమా తో ఆయన  కాస్త భయపడ్డారు అని.. అందుకే ఈ సినిమాను అక్కడ విడుదల చేసే విషయంలో ఆలోచన చేస్తున్నారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: