ప్రభాస్ ఏవిషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోడు అదేవిధంగా ప్రభాస్ కు జాతకాలు దేవుళ్ళ పై పెద్దగా సెంటిమెంట్స్ కూడ పెట్టుకోడు. అందువలనే కృష్ణంరాజు భక్తకన్నప్ప మూవీని రీమేక్ చేయాలని ప్రయత్నించినా ప్రభాస్ పెద్దగా ఆసక్తి కనపరచలేదు. అలాంటి ప్రబాస్ ను ఇప్పుడు అనుకోకుండా నాగ్ అశ్విన్ ఆధ్యాత్మికంగా కార్నర్ చేయబోతున్నాడా అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈ మధ్య కాలంలో సినిమాలలో దేవుళ్ళ టాపిక్ పెద్దగా కనిపించడం లేదు. ఒకప్పటి సినిమాలకు అది ఒక కీలక అంశంగా ఉండి హీరోలు హీరోయిన్స్ దేవుళ్ళ గుళ్ళలోకి వెళ్ళి భారీ పాటలు పాడే సన్నివేశాలతో సినిమాలు ఉండేవి. ముఖ్యంగా కోడి రామకృష్ణ ఈ దేవుళ్ళ సెంటిమెంట్ ను గ్రాఫిక మాయాజాలంతో బాగా ఉపయోగించుకుని ఒకప్పుడు చాల మంచి హిట్స్ తీసాడు.


ఇప్పుడు జనం మర్చిపోయిన ఆ జోనర్ తిరిగి ప్రభాస్ నాగ్ అశ్విన్ ల లేటెస్ట్ మూవీ ప్రాజెక్ట్ లో తిరిగి కనిపించబోతోందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కొందరకు వస్తున్నాయి. వాస్తవానికి ప్రభాస్ నాగ్ అశ్విన్మూవీ ప్రాజెక్ట్ కథ సోషియో ఫాంట‌సీ అనీ, సైన్స్ ఫిక్ష‌న్ అని జాన‌ప‌దం అని ర‌క‌ర‌కాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.


అయితే ఈ సినిమా కథ సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో కొనసాగుతూ మధ్యలో ఆధ్యాత్మిక భావాలు దేవుడు మహిమలకు సంబంధించిన అంశాలు కూడ ఈ మూవీ కథలో ఉంటాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే అంత‌ర్లీనంగా మాత్రమే దేవుడి మహిమలను టచ్ చేస్తూ పైకి మాత్రం ఈ మూవీ కథ సైన్స్ ఫిక్షన్ కథలా కొనసాగుతుంది అన్న లీకులు వస్తున్నాయి. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్న పరిస్థుతులలో ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు దీపికా పదుకొనె ఎంపిక దాదాపు ఖాయం అయింది అన్న ప్రచారం జరుగుతోంది. కరోనా ఎఫెక్ట్ తో సంబంధం లేకుండా ఈ మూవీ బడ్జెట్ విషయంలో ఎటువంటి మినహాయింపులు ఇవ్వకుండా ఈ మూవీని సుమారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయాన్ని స్వయంగా నిర్మాత అశ్వినీ దత్ తెలియచేసిన విషయం తెలిసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: