నందమూరి బాలకృష్ణ నటించిన వందవ చిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రం తర్వాత వరుస ఫ్లాపులు ఎదురువుతున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడింది. ఆ మద్య వచ్చిన రూలర్ మూవీ కూడా ఫ్లాప్ అయ్యింది. దాంతో ఇప్పుడు మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వంలో  బాలయ్యకు మాస్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం రైతు సమస్యలపై ఉండబోతున్నట్లు  రిలీజ్ అయిన టీజర్ బట్టి తెలుస్తుంది. అందులో ఈ నందమూరి సీనియర్ హీరో పలికిన పవర్ ఫుల్ డైలాగులు అభిమానులను విపరీతంగా అలరిస్తున్నాయి. తాజాగా  టీజర్ ట్రెండింగ్ పై బాలకృష్ణ స్పందించారు.

 

బోయపాటితో తాను నటించిన సినిమాలన్నీ హిట్ అయ్యాయని, ఇప్పుడొస్తున్న మూడో చిత్రం కూడా హిట్టేనని ధీమా వ్యక్తం చేశారు. హిట్ కాకుండా ఎక్కడికి పోతుంది అంటూ వ్యాఖ్యానించారు.  గతంలో సింహా, లేజెండ్ ఎంతటి ఘన విజయాన్ని అందుకున్నాయో.. ఇప్పుడు వచ్చే మూవీ కూడా అంతకు రెట్టింపు విజయాన్ని అందుకుంటుందని అన్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో రెట్టింపు వేగంతో పూర్తిచేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తన చిత్రం టీజర్ ట్రెండింగ్ లో ఉందంటూ ఆయన హర్షం వ్యక్తం చేశారు. టీజర్ ఈ రేంజ్ లో ట్రెండ్ సృష్టిస్తుందని అనుకోలేదని.. అదంతా అభిమానుల క్రెడిట్ ని అన్నారు. ఏది ఏమైనా లాక్ డౌన్ లో షూటింగ్ చేసుకోలేదని త్వరలో షూటింగ్ కంప్లీట్ చేసి ప్రేక్షకుల ముందుకు వస్తామని అన్నారు బాలయ్య. 

మరింత సమాచారం తెలుసుకోండి: