రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం యువ దర్శకుడు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఇప్పటికే యూనిట్ సభ్యులు సర్వం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు ఒక ముఖ్య పాత్రలో నటిస్తుండగా, ఒకప్పుడు బాలీవుడ్ లో సూపర్ హిట్ కొట్టిన ప్రేమపావురాలు హీరోయిన్ భాగ్యశ్రీ ప్రభాస్ కు తల్లిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. యువి క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ సంస్థలు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ వాస్తవానికి ఈపాటికే రిలీజ్ కావలసి ఉంది. అయితే మధ్యలో కరోనా కారణంగా కొన్నాళ్లపాటు వాటిని వాయిదా వేశారు. 

IHG

అయితే మిగతా అన్ని సినిమాలు కూడా ఫస్ట్ లుక్ పోస్టర్ల తో పాటు టైటిల్ వంటివి అనౌన్స్ చేస్తుంటే తమ హీరో సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయినప్పటికీ కూడా, దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక్క అప్ డేట్ కూడా ఇవ్వకుండా ఉండడం అన్యాయం అంటూ ఇటీవల ప్రభాస్ ఫ్యాన్స్, నిర్మాతలపై అసహనం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో కొంత రచ్చ చేయడం జరిగింది. కాగా అనంతరం యువి క్రియేషన్ సంస్థ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా స్పందిస్తూ, ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆశిస్తున్న విధంగా అందరినీ ఆకట్టుకునేలా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ కూడా రెడీ చేస్తున్నట్లు తెలిపారు. 

 

కాగా రెండు రోజుల క్రితం నుండి కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ఈ సినిమా టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్లు చెప్తున్నారు. అయితే ముందుగా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకోగా, ఆ తరువాత సమంత, శర్వానంద్ సినిమాకు జాను టైటిల్ ని ఫిక్స్ చేయడంతో దానిని వద్దనుకున్నారు. ఇక ఆ తరువాత నుండి ఈ సినిమాకు ఓ డియర్, రాధే శ్యామ్ టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు రావడం జరిగింది. అయితే ఫైనల్ గా యూనిట్ మాత్రం ఓ డియర్ టైటిల్ కె ఓటేసిందని అంటున్నారు. రాధే శ్యామ్ అనే టైటిల్ కూడా అనుకున్నప్పటికీ, ఇటీవల సల్మాన్ ఖాన్ లేటెస్ట్ మూవీకి రాధే టైటిల్ ఫిక్స్ చేయడంతో దానిని కూడా వద్దనుకున్నారట. కాగా మరికొద్దిరోజుల్లో ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ కు సంబందించిన అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: