కేవలం హీరోగానే చేస్తూ డబ్బులు సంపాదించాలంటే కష్టమైన పని అందుకే మన స్టార్స్ ఓ పక్క సినిమాలు చేస్తూ మరోపక్క వాణిజ్య ప్రకటనలు చేస్తారు. ఇక కొంతమంది తమ టేస్ట్ కు తగినట్టుగా బిజినెస్ లు కూడా చేస్తుంటారు. సూపర్ స్టార్ మహేష్ ఇప్పటికే యాడ్స్ చేస్తూ, థియేటర్ బిజినెస్ లో కూడా ప్రవేశించారు. ఇక ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాతగా కూడా మెప్పించాలని ప్రయత్నిస్తున్నారు. మహేష్ సొంతంగా జిఎంబి ప్రొడక్షన్స్ స్థాపించిన విషయం తెలిసిందే. అందులో ప్రస్తుతం సినిమాలు చేయట్లేదు. తను చేసే సినిమాలకు ఆ ప్రొడక్ష కో స్పాన్సర్ గా ఉంటుంది.

 

అయితే ఈమధ్య చిన్న సినిమాల్లో ఎక్కువ లాభాలు వచ్చిన సినిమాలు చూసి సరైన కంటెంట్ తో తీస్తే చిన్న బడ్జెట్ సినిమా కూడా పెద్ద హిట్టు అవుతుందని మహేష్ కు అర్ధమైంది. అందుకే నిర్మాతగా బయట సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే అడివి శేష్ తో మేజర్ సినిమా చేస్తున్న మహేష్ ఈమధ్య విజయ్ దేవరకొండతో కూడా సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. కాని లేటెస్ట్ టాక్ ప్రకారంగా మహేష్ విజయ్ ప్లేస్ లో యువ హీరో విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే ఈ ఇద్దరి మధ్య చర్చలు జరిగాయట.

 

మహేష్ ప్రొడక్షన్ కు సంబందించిన అన్ని విషయాలను నమ్రత దగ్గర ఉండి చూసుకుంటుందని తెలుస్తుంది. అంతేకాదు మహేష్ బాబు సినిమాల విషయంలో కూడా ఆమె జోక్యం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. పరశురాం డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాలో కీర్తి సురేష్, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటిస్తారని తెలుస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ కలిసి నిర్మిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: