తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించిన సీనియర్ నటులు విజయ్ కుమార్, నటి మంజుల  దంపతుల కుమార్తె వనిత విజయకుమార్ ఈ మద్య మూడో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. మొదటి నుంచి ఎన్నో కాంట్రవర్సీలకు కేంద్రంగా నటి వనిత ఉంటూ వస్తుంది. దేవి చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత తెలుగు లో కనిపించలేదు. తమిళ చిత్రాల్లో నటించిన వనిత ఇప్పటికే రెండు వివాహాలు చేసుకున్న విషయం తెలిసిందే.తాజాగా ఆమె మూడో వివాహం విషయంపై కొంత మంది విమర్శలు గుప్పించినా.. ఎవరి ఇష్టం వారిదే అని.. వైవాహిక విషయంలో జోక్యం చేసుకోవడం మంచి పద్దతి కాదని అన్నారు. తాజాగా వనిత పీటర్ పాల్ అనే విజువల్ ఎఫెక్ట్స్ డైరెక్టర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది.

 

ఈ నేపథ్యంలో సినీనటి, యాంకర్ లక్ష్మీ రామకృష్ణన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.  పీటర్ ఇప్పటికే పెళ్లైన వ్యక్తి అని.. అతనికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని.. అలాంటి వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఏంటీ అని ప్రశ్నించింది. అంతే కాదు అతని భార్యకు విడాకులు కూడా ఇవ్వలేని.. ఆకుటుంబానికి అన్యాయం చేసినట్లే అని ఆమె వ్యాఖ్యానించింది.   ఉన్నత చదువులు చదివి, సెలబ్రిటీలుగా ఉన్నవారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారని అడిగారు. ఈ పెళ్లిని పీటర్ మొదటి భార్య ఎందుకు ఆపలేదని కూడా ప్రశ్నించారు.

 

తాజాగా లక్ష్మీ రామకృష్ణన్ పై వనిత మండిపడ్డారు.  పెళ్లి అనేది ఇద్దరి మనసులకు సంబంధించిన విషయం అని..  ఇద్దరు వ్యక్తులు ఎందుకు విడిపోతారో? ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? అని ప్రశ్నించారు. ఇది నీకు సంబంధం లేని విషయమని, ఇందులో వేలు పెట్టొద్దని అన్నారు. తాను ఎవరి జీవితంలోనూ తలదూర్చడం లేదని... మీరు కూడా మీ పని చేసుకుంటే మంచిదని వనిత సీరియస్ గా చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: