నాగచైతన్య రేంజ్ కంటే కీర్తి సురేశ్ ఇమేజ్ చాల ఎక్కువ జాతీయస్థాయి ఉత్తమ నటి అవార్డు పొందడమే కాకుండా ప్రస్తుతం దక్షిణాది సినిమా రంగంలో కీర్తి పాపులర్ హీరోయిన్. ఇలాంటి పరిస్థితులలో కీర్తి సురేశ్ ను తన పక్కన హీరోయిన్ గా ఎంపిక చేయవద్దు అంటూ నాగచైతన్య సలహా ఇచ్చాడు అంటూ గాసిప్పులు గుప్పుమంటున్నాయి.


ఇక వివరాలలోకి వెళితే అక్కినేని కుటుంబానికి అద్బుతమైన ‘మనం’ లాంటి మూవీని ఇచ్చిన విక్రమ్ కుమార్ అంటే నాగార్జునకు చాలమంచి అభిప్రాయం. ఆ అభిమానంతోనే అఖిల్ ను విక్రమ్ కుమార్ చేతిలో పెట్టినా అతడు హిట్ ఇవ్వలేకపోయినా మళ్ళీ నాగచైతన్యతో విక్రమ్ కుమార్ సినిమా తీసే విషయంలో నాగార్జున ప్రోత్సాహం ఉంది అని అంటున్నారు.


ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన కథ ఫైనల్ కావడంతో ప్రస్తుతం విక్రమ్ కుమార్ ఈమూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పై నటీనటుల ఎంపిక పై దృష్టి పెట్టాడు. ఈ నేపధ్యంలో ఈమూవీ కథ రీత్యా హీరోయిన్ పాత్రకు కీర్తి సురేశ్ బాగుంటుంది అని విక్రమ్ కుమార్ ఇచ్చిన సలహాకు చైతు నో చెప్పినట్లు టాక్. దీనికికారణం ఆమె లేటెస్ట్ గా నటించిన ‘పెంగ్విన్’ అని అంటున్నారు.

ఈమూవీలో ఆమె లుక్ ఏమాత్రం బాగుండకపోవడంతో అనేక విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఆవిమర్శలను దృష్టిలో పెట్టుకుని చైతన్య తన లేటెస్ట్ మూవీలో కీర్తి సురేశ్ కు బదులు రష్మిక ను ఎంపిక చేయమని విక్రమ్ కుమార్ కు సలహా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ‘పెంగ్విన్’ లోని కీర్తి సురేశ్ లుక్ మహేష్ అభిప్రాయాలను ఏమాత్రం ప్రభావితం చేయకపోవడంతో పరుశు రామ్ తో తాను చేయబోతున్న ‘సర్కారు వారి పాట’ మూవీకి మరో ఆలోచన లేకుండా కీర్తిని ఫైనల్ చేయమని చెప్పడంతో ‘పెంగ్విన్’ చైతన్యను భయపెట్టినంతగా మహేష్ ను భయపెట్టలేదా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: