టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు మంచి కుటుంబ కథ చిత్రాల దర్శకునిగా పేరొందిన  పరశురామ్ దర్శకత్వం లో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీని  బ్లాక్ బస్టర్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి సంయుక్తoగా నిర్మిస్తూవున్నాయి. మహేష్ బాబు కూడా ఈ మూవీ కి మూడవ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినా ప్రీ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తుండడమే కాకుండా విశేషణమైన స్పందన రాబట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబందించిన అన్ని పనులు చాలా పక్కాగా ప్లాన్ ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. ఈ సినిమా కి థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం మహేష్ బాబు తన బర్త్ డే కి ఫ్యాన్స్ కి ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తూ ఉంటారు. ఈసారి కూడా అభిమానులకి మంచి సర్ప్రైజ్ ఇవ్వాలని సర్కారు వారి పాట టీం నిర్ణయించుకుంది. ఇంకా 3 రోజుల్లో ఆగష్టు 9 వ తేదీ న మహేష్ బాబు పుట్టినరోజు రోజు సందర్బంగా చిత్ర బృందం ఒక "వాయిస్ గ్లిమ్ప్స్" ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఈ సర్ప్రైజ్ తో అభిమానుల్లో జోష్ నింపాలని చిత్ర బృందం భావిస్తుంది. ఖచ్చితంగా ఇది ఫ్యాన్స్ కి మంచి అనుభూతి ని ఇస్తుందని చిత్ర బృందం వారంతా  ఆశపడుతున్నారు. కాగా ఈ సినిమా కు అదిరి పోయే ట్యూన్స్ ఇస్తానని థమన్ ఫ్యాన్స్ కి మాట ఇచ్చి మంచి జోష్ ని నింపాడు. సినిమా లో మహేష్ సరసన కీర్తి సురేష్, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ లు గా ఎంపిక అయ్యారు. మంచి కమర్షియల్ ఎలెమెంట్స్ తో రానున్న ఈ చిత్రం పక్కాగా పెద్ద హిట్ అవుతుంది అని చిత్ర బృందం తో ఫ్యాన్స్ కూడా నమ్మకం గా ఎదురుచూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: