మహేష్, చరణ్ ఇద్దరు కాదనేసరికి వంశీ పైడిపల్లి అక్కినేని హీరో అఖిల్ తో సినిమా ఫిక్స్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అఖిల్ ప్రస్తుతం బ్యాచ్ లర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అసలైతే సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందని అంటున్నారు. ఆ సినిమాతో పాటుగా వంశీ పైడిపల్లి కూడా అఖిల్ తో సినిమాకు సిద్ధం అవుతున్నాడని తెలుస్తుంది. నాగార్జునతో ఊపిరి సినిమా చేసిన వంశీ పైడిపల్లి మీద అక్కినేని ఫ్యామిలీకి మంచి ఒపీనియన్ ఉంది.
ఎలాంటి కథ అయినా వంశీ బాగా హ్యాండిల్ చేస్తాడన్న నమ్మకం ఉంది. అందుకే అఖిల్ తో వంశీ పైడిపల్లి మూవీకి నాగార్జున కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టడని తెలుస్తుంది. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను కెరియర్ లో మూడు సినిమాలు చేసిన అఖిల్ ఇప్పటివరకు కమర్షియల్ సక్సెస్ అందుకోలేదు. బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో వస్తున్న బ్యాచ్ లర్ సినిమా తప్పకుండా అలరించేలా ఉంది. ఆ సినిమా హిట్ అయితే అఖిల్ ట్రాక్ లోకి వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి