తెలుగులో ప్రసారమవుతున్న టాప్ రియాలిటీ షో బిగ్ బాస్.. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ నాలుగో సీజన్ మొదలైంది.మొదటి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా జనాల నుంచి విశేష స్పందన లభించింది. రెండో సీజన్లో న్యాచురల్ స్టార్ నాని సందడి చేశారు. మూడు, నాలుగు సీజన్లకు హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. గత వారం సెప్టెంబర్ ఆరున ఈ షో ప్రారంభమైంది. ప్రతి సీజన్ లో లాగే ఈ సీజన్ లో కూడా 16 కంటెస్టెంట్స్, వంద రోజుల ప్రయాణం మొదలైంది.


కాగా, ఈ సీజన్ లో వచ్చిన ప్రతివాల్లు సమాజంలో ఏదోక రంగంలో గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళే.. అందులో గంగవ్వ, కరాటే కళ్యాణి, దేవి నాగవల్లి జీవిత విశేషాలు కాస్త ఎమోషన్ అనిపించాయి. అయితే ఈ షో లో వేరే రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చిన పస లేదంటూ ప్రేక్షకులు అంటున్నారు. కాగా షో మొదలై వారం రోజులు పూర్తికావడంతో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. అయితే నామిషన్ జోన్ లో ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఎవరు ఇంటి నుంచి బయటకు వస్తారు అనేది ఆసక్తిగా మారింది. ఎటూ చూసిన కూడా  షో నుంచి ఎలిమినేట్ అవుతాడని నెటిజన్లు అభిప్రాపడుతున్నారు..



మరి వారి అంచనాలు ఏ మాత్రం తీరతాయో తెలియాలంటే ఈరోజు ప్రసారం కానున్న ఎపిసోడ్ ను చూడాల్సిందే.. ఇది ఇలా ఉండగా ఎప్పటిలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా కొత్త వాళ్ళను హౌస్ లోకి పంపిస్తున్నారు. ఈ సారి ఏకంగా ముగ్గురిని హౌస్ లోపలికి పంపిస్తున్నారట.. జబర్దస్త్ అవినాష్, కమెడియన్ సాయి, నటి స్వాతి దీక్షిత్. వీరు ముగ్గురు ఒకేసారి వస్తారా లేక ఒక్కొక్కరిని ఒక్కోసారి పంపిస్తారా అనేది తెలియాల్సి ఉంది. నెక్స్ట్ వారం ఎలిమినేషన్ ప్రక్రియ రేపు మొదలు కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: