‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ పాత్రకు సంబంధించిన టీజర్ ఈనెల 22న విడుదల అవుతున్న నేపధ్యంలో ఆ వెనువెంటనే రాబోతున్న ప్రభాస్ పుట్టినరోజునాడు తనకు కూడ ఏదైనా బహుమతి ఉంటుందని ప్రభాస్ అభిమానులు ఎంతో ఆశపడ్డారు. ఈ నేపధ్యంలో ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ కు సంబంధించిన టీజర్ ఉంటుందని కలలు కన్నారు.


కరోనా కారణంగా వాయిదా పడిన ఈమూవీ షూటింగ్. ఈ మధ్యనే  ఇటలీలో తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం యూరప్ లో కరోనా కేసులు మళ్ళీ తిరగబెట్టినా ధైర్యంగా ఈమూవీ షూటింగ్ ను కొనసాగిస్తున్నారు. ఇప్పుడు 'రాధే శ్యామ్' టీమ్ డార్లింగ్ బర్త్ డే గిఫ్ట్ అనౌన్స్ చేసింది అయితే అది ఈ మూవీ టీజర్ కాదు.



అక్టోబర్ 23న ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ఈ చిత్రం నుంచి ఫస్ట్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీనితో ప్రభాస్ అభిమానులు నిరాశలోకి వెళ్ళిపోయారు. ‘సాహో’ ఫెయిల్యూర్ తరువాత ప్రభాస్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈచిత్రం పై భారీ అంచనాలే ఉన్నాయి. దీనికి తగ్గట్టే ఇప్పటికే రిలీజైన చిత్ర ఫస్ట్ లుక్ విశేషంగా ఆకట్టుకుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని 2021 సమ్మర్ లో రిలీజ్ అవుతుందని లీకులు వస్తున్నాయి.


ఇది ఇలా ఉండగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న ‘రాధేశ్యామ్’ ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి దాదాపు 140 కోట్లకి పైగా ఖర్చు అయిందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా పూర్తయ్యే లోపు మరో 30 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. భారీ సెట్టింగ్స్ తోనే ఈ సినిమా బడ్జెట్ అమాంతం పెరిగిపోయిందని తెలుస్తోంది. దీనితో ఇంత భారీ బడ్జెట్ ఈ మూవీ పై అవసరమా అన్న కామెంట్స్ ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తూ ప్రభాస్ మరొక సాహసం చేస్తున్నాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: