ప్రస్తుతం బుల్లితెరపై యాంకర్ అనసూయకు  ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓ  వైపు బుల్లితెరపై యాంకర్గా అందరినీ ఆకర్షిస్తూనే మరోవైపు వెండితెరపై కూడా తన సత్తా చాటుతూ తనలోని నటిని నిరూపించుకుంది అనసూయ. తనకు వచ్చిన అన్ని అవకాశాలను ఎంతో బాగా  ఉపయోగించుకుంటున్న అనసూయ ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా యాంకర్ గా  తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరైన అనసూయ ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త  పాత్రతో తెలుగు ప్రేక్షకుల మనసులకు మరింత దగ్గర అయిపోయింది.




 ప్రస్తుతం అనసూయను రంగమ్మత్త గానే తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తూ ఉంటారు. అయితే ప్రొఫెషనల్గా ఎంత కచ్చితత్వంతో ఉంటుందో కుటుంబం విషయంలో కూడా అంతే కచ్చితత్వంతో ఉంటుంది అనసూయ. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు రకాల ఫోటో షూట్లతో అభిమానులను అలరిస్తోంది ఉంటుంది. అంతేకాదండోయ్.. తనమీద బ్యాడ్ కామెంట్ లు  చేసిన వారి విషయంలో కూడా గట్టిగానే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అనసూయ. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంటుంది. ఇలా ఓ వైపు బుల్లితెరపై మరోవైపు వెండితెరపై ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా వెనకడుగు వేయకుండా దూసుకుపోతుంది అనసూయ.




 అయితే ఇటీవలే యాంకర్ అనసూయ తన కుమారుడు చెప్పిన మాటలకు ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకున్నట్లు చెప్పుకొచ్చింది. మమ్మా... నేను మళ్ళీ గడచిపోయిన కాలాని కి వెళ్ళాలి అనుకుంటున్నాను అంటూ అనసూయ కుమారుడు  తల్లితో చెప్పాడట. 2017, 18 సంవత్సరాల్లో  ఎంతో బాగుండేది అని.. ఆ సమయంలో కరోనా వైరస్ లేదు ఇలా వరదలు లేవు అందరూ ఎంతో హ్యాపీగా ఉన్నారు నేను కూడా ఎంతో హ్యాపీగా ఉన్నాను అందుకే గడిచిన కాలానికి వెళ్లాలనుకుంటున్నాను అంటూ తన కొడుకు తనతో చెప్పడంతో ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు ఆగలేదట అనసూయకి. ఈ క్రమంలోనే మనం ఇలాంటి పరిస్థితులను కొనితెచ్చుకున్నాం..  రాబోయే తరాలకు అసలేం అందిస్తున్నాం అంటూ సోషల్ మీడియా వేదికగా అనసూయ స్పందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: