టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోయిన్ లలో కాజల్ అగర్వాల్ ఒకరు. ఈమె టాలీవుడ్ ఇండ్రస్టీ కి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ తన స్టార్ డం ను కొనసాగిస్తూనే ఉంది కాజల్. ఇప్పుడు ఈ అందాల తార అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించడం విశేషం. ముంబైకి చెందిన పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది.ఇదిలా ఉంటె టాలీవుడ్ లో కాజల్ చాలా మంది స్టార్ హీరోల సరసన నటించింది.వారితో ఈ అమ్మడికి మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే  ఈ నెల చివర్లో జరగబోతున్న కాజల్ పెళ్లికి టాలీవుడ్ స్టార్ హీరోలెవరైనా వెళ్తారా అన్నది సందేహంగానే ఉంది.

 మామూలు రోజుల్లో అయితే ఓకే, అది కూడా హైదరాబాద్‌లో పెళ్లి అంటే అది వేరు. కానీ ఇప్పుడు కరోనా టైం నడుస్తోంది.పెళ్లిళ్లకు పరిమిత సంఖ్యలో మాత్రమే అతిథులు హాజరవుతున్నారు. పైగా కాజల్ పెళ్లి జరగబోయేది ముంబయిలో.ఐతే స్టార్ హీరోల సంగతేమో కానీ.. యంగ్, అప్ కమింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం కాజల్ పెళ్లికి హాజరు కాబోతున్నాడు. ఈ విషయాన్ని అతనే వెల్లడించాడు. ఎక్కువగా స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన కాజల్.. కెరీర్ చివర్లో బెల్లంకొండ శ్రీనివాస్‌తో  సీత, కవచం లాంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు  చేసి ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ సమయంలో వీళ్లిద్దరూ బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిన విషయం కొన్ని ఫొటోలను బట్టి తెలిసింది.

కరోనా టైంలో కాజల్‌ను మిస్సవుతున్నట్లు కూడా శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం చర్చనీయాంశమైంది. ఇప్పుడు కాజల్ పెళ్లి గురించి శ్రీనివాస్ స్పందిస్తూ.. ''కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా కుటుంబంలోని వ్యక్తితో సమానం. కాజల్‌కు మంచి జీవిత భాగస్వామి దొరకడం సంతోషంగా ఉంది. గౌతమ్ గొప్ప వ్యక్తి. వారిద్దరికీ నా శుభాకాంక్షలు. నేనిప్పుడు షూటింగ్‌లో ఉన్నాను. కానీ విరామం తీసుకుని కాజల్ పెళ్లికి హాజరు కావాలి. మిగిలిన పనుల కోసం తన పెళ్లికి దూరం కాలేను'' అని చెప్పాడు. ఈ మాటల్ని బట్టి శ్రీనివాస్, కాజల్‌లది క్లోజ్ ఫ్రెండ్‌షిప్పే అని అర్థమవుతోంది.సో మొత్తానికి మన అందాల చందమామ కాజల్ పెళ్లికి వెళ్ళే ఆ  హీరో మన బెల్లంకొండ శ్రీనివాస్ ఒక్కడే అన్నమాట...!!

మరింత సమాచారం తెలుసుకోండి: