ఫిలిం ఇండస్ట్రీలో రాజమౌళి సుకుమార్ లు ఒక సీన్ తీసే విషయంలో వెంటనే సంతృప్తి చెందారు అన్న పేరు ఎప్పటి నుంచో ఉంది. దీనితో వీరి సినిమాలలో నటించే నటీనటులకు చాల సహనం ఉండాలి అంటూ జోక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ లిస్టులో శేఖర్ కమ్ముల కూడ చేరిపోయాడా అంటూ కొందరు జోక్ చేస్తూ నాగచైతన్య ఈ చెక్కుడు చూసి కంగారు పడుతున్నాడు అంటూ గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి.

సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరుగాంచిన శేఖర్ కమ్ముల వేగంగా సినిమాలు తీయగల శక్తి ఉండి ఉంటే ఈపాటికి చాల సినిమాలు తీసి ఉండేవాడు. ‘ఫిదా’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత అందరూ కొత్తవాళ్ళతో ఒక సినిమా తీద్దామని ప్రయత్నించిన ఈ డైరెక్టర్ తన అవుట్ పుట్ తనకే నచ్చకపోవడంతో ఆ సినిమాను మధ్యలో వదిలేసి నాగచైతన్య సాయి పల్లవితో లవ్ స్టోరీ మూవీని మొదలు పెట్టాడు.


వాస్తవానికి కరోనా పరిస్థితులు అడ్డు లేకుండా ఉండి ఉంటే ఈమూవీ ఈ పాటికే విడుదల అయి ఉండేది. ఇప్పుడు షూటింగ్ లు తిరిగి ప్రారంభం కావడంతో ఈ మూవీ షూట్ ను శేఖర్ కమ్ముల తిరిగి మొదలుపెట్టినప్పటికీ ఈమూవీ షూట్ లో శేఖర్ కమ్ముల ఈ సినిమాకు సంబంధించి తాను తీయవలసిన సీన్స్ ఒకటికి మూడు ఫ్రేమ్ లు తీస్తున్నట్లు తెలుస్తోంది.


ఆ సీన్స్ ఒకొక్కటి తరిచితరిచి చూసుకుంటూ చాల నెమ్మదిగా ఈ మూవీ షూటింగ్ ను కొనసాగిస్తూ ఉండటంతో ఈ మూవీ నిర్మాతకు షూటింగ్ ఖర్చులతో కరోనా ఖర్చులు కూడ పెరిగి పోవడంతో ఈమూవీ నిర్మాత తల పట్టుకుంటున్నట్లు టాక్. దీపావళికి అయినా సినిమా ధియేటర్లు ఓపెన్ అయితే ఈ మూవీని క్రిస్మస్ కు ‘వకీల్ సాబ్’ పోటీ లేకుండా ఉంటే ఈ మూవీని సంక్రాంతికి అదీ కుదరకపోతే వ్యాలెంటైన్ డే కు అయినా విడుదల చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: