మెగా స్టార్ చిరంజీవి కోడలు ఉపాసన చాల ఓపెన్ మైండ్ తో ఏవిషయాన్ని అయినా చాల ధైర్యంగా చెపుతుంది. ఆమె మాటలలో ఎటువంటి అస్పష్టత కనిపించదు. ఉన్నది ఉన్నట్లు చెప్పడం ఆమె అలవాటు. అందువల్లనే ఆమె అనేక వ్యాపారలో రాణిస్తోంది అనుకోవాలి. ఏదీ దాపరికం లేకుండా మాట్లాడే ఉపాసన ఏ కామెంట్స్ చేసినా అది సంచలనమే.


అపోలో సంస్థలో కీలక భాద్యలతో కొనసాగుతూ ఉన్నప్పటికీ ఒక అగ్ర కథానాయకుడి భార్య అయినప్పటికీ ఆ రేంజ్ హంగామా హడావుడి ఆమె వద్ద కనిపించకుండా డౌన్ టు ఎర్త్ గా ఆమె వ్యవహరిస్తూ ఉంటుందని ఆమె సన్నిహితులు చెపుతూ ఉంటారు. సొంత వ్యాపారాలపై నిరంతరం   ఫోకస్ పెడుతూ అనేక సామాజిక కార్యకలాపాలు చేస్తూ ఈమె ఇటీవల యువర్ లైఫ్ పేరుతో వెబ్ సైట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే.



ప్రస్తుతం ఆమె తరుచు అందరిలోను లైఫ్ స్టైల్ ఆరోగ్యం తదితర విషయాలపై అవగాహన పెంచడానికి ఒక పత్రిక కూడ నిర్వహిస్తోంది. కరోనా మహమ్మారీ సమయంలో ఉపాసన ఉచితంగా అపోలో తరపున పలు సేవలను  చేసింది.  మాస్కులు పంపిణీ శానిటైజర్లు పంపిణీ లాంటి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తూ సాధారణ ప్రజలలో కరోన పట్ల అవగాహన పెంచడానికి అనేక కార్యక్రమాలు చేస్తోంది.


ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఒక షాకింగ్ విషయం బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్ ఒకరు హిజ్రా (ట్రాన్స్ జెండర్) అన్న విషయాన్ని ఉపాసన బహిరంగంగా చెప్పడమే కాకుండా హిజ్రాల పట్ల తనకు ప్రత్యేకమైన గౌరవం ఉంది అన్న విషయాన్ని తెలియచేసింది. ఇదే ఇంటర్వ్యూలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇంట్లో మహిళల్ని గౌరవించలేని వారు ఇంట్ల దేవీ మాతల ఫోటోలు పెట్టుకోకూడదని ప్రార్థనలు చేయవద్దని దానివలన ఫలితం ఉండదు అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఉపాసన చేసిన ఈ కామెంట్స్ మెగా ఫాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది..  

మరింత సమాచారం తెలుసుకోండి: