అతి త్వరలో మహేష్ బాబు హీరోగా నటించనున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే కెరీర్ పరంగా భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మూడు భారీ హిట్స్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ మహేష్. లాక్ డౌన్ కారణంగా సర్కారువారు పాట సినిమా షూటింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికాలో ప్రారంభం కానున్న ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూలు కూడా మరి కొద్ది రోజులు వాయిదా పడిందని, దానికి కారణం అమెరికాలో వరుసగా కరోనా కేసులు పెరుగుతూ ఉండటం అని అంటున్నారు.

14 రీల్స్ ప్లస్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు కలిసి ఎంతో గ్రౌండ్ లెవల్ లో నిర్మించనున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు జోడిగా తొలిసారిగా మహానటి ఫేమ్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా యువ సంగీత తరంగం థమన్ దీనికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించనున్న కీర్తి సురేష్ గత కొద్ది రోజులుగా బాగా డైటింగ్ చేస్తూ కొంత సన్నబడ్డారు. అయితే తమ సినిమాలోని పాత్ర రీత్యా ఆమెను కొంత బొద్దుగా తయారవమని చెప్పారట దర్శకుడు పరశురామ్.

ఇక అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతోంది కాబట్టి ఇప్పటి నుండే ఫుల్ గా లాగించేసి బొద్దుగా తయారయ్యేందుకు రెడీ అవుతోందట కీర్తి. మరోవైపు కీర్తి ప్రధానపాత్రలో నటించిన మిస్ ఇండియా సినిమా అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా, తొలిసారిగా మహేష్ తో కలిసి నటిస్తున్న ఈ సర్కారు వారి పాత సినిమాతో తప్పకుండా విజయాన్ని కైవసం చేసుకుంటానని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోందట....!!

మరింత సమాచారం తెలుసుకోండి: