టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యు.వి.ప్రొడక్షన్స్ బేనర్ పై యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ ప్రతిష్టాత్మక సినిమా సాహో. గత ఏడాది మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఓవరాల్ గా యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికి అటు నార్త్ లో మాత్రం ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. కాగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అవ్వడం జరిగింది. మొదట బాలీవుడ్లో ఆషీకీ2 సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన శ్రద్ధాకపూర్ ఆ సినిమాతో అక్కడ భారీ స్థాయి విజయాన్ని అందుకొని యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్లో కూడా మంచి పేరు దక్కించుకున్నారు.

అక్కడి నుండి వరుసగా బాలీవుడ్ సినిమాలు చేస్తూ అంతకంతకు మరింత క్రేజ్ ను పెంచుకుంటూ కొనసాగుతున్న శ్రద్ధ, తనకు సాహో లో అవకాశం రావడంతో తప్పకుండా ఆ సినిమా ద్వారా తనకు సౌత్ లో మంచి క్రేజ్ లభిస్తుందని ఆశించారు. అయితే ఓవరాల్ గా ఆ సినిమా యావరేజ్ విజయాన్ని అందుకోవడంతో ఆపై ఆమె సౌత్ సినిమా ఒక్కటి కూడా చేయలేదు. ఇటీవల కొందరు సౌత్ సినిమాల దర్శకులు ఆమెను కలిసి తమ సినిమాలో యాక్ట్ చేయాలని కోరినప్పటికీ కూడా ఆమె వాటిని అంగీకరించలేదని అనేటువంటి వార్త ఒకటి కొద్ది రోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతోంది.

వాస్తవానికి తాను భావించిన విధంగా సాహో సక్సెస్ కాకపోవటమే ఆమె ఇప్పటి వరకు మరొక సౌత్ సినిమా ఎంచుకోక పోవడమే కారణమని అంటున్నారు. ఇక కొద్ది రోజుల నుండి ప్రచారం అవుతున్న మరొక వార్త ప్రకారం అతి త్వరలో ప్రభాస్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న భారీ హిస్టారికల్ సినిమా ఆదిపురుష్ లో రాముడి పాత్ర పోషించనున్న ప్రభాస్ కు జోడీగా సీత పాత్ర లో ఆమె నటించనుందని అంటున్నారు. కాగా దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన కూడా రానుందని వార్త ప్రచారం అవుతోంది. మరి ఇవన్నీ పక్కన పెడితే రాబోయే రోజుల్లో అయినా శ్రద్ధ మరొకసారి సౌత్ వైపు చూస్తారా ఇక్కడ ఏదైనా ఒక సినిమాలో అవకాశం వస్తే చేస్తారా లేదా అనేది తెలియాలి అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: