ఇటీవలే వ్యాపారవేత్త గౌతమ్ ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొందరు నిర్మాతలు తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాజల్ అగర్వాల్ పెళ్లి కాకముందు తీసుకున్న అడ్వాన్స్ లను కొన్ని తిరిగి ఇచ్చేశారట. పార్టీలో ఎక్కువగా ప్రకటనలకు సంబంధించినవి ఉన్నాయని.. రెండు సినిమాలకు సంబంధించినవి ఉన్నాయని తెలుస్తోంది.


ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్.. కమల్ హాసన్ తో ఇండియన్ 2  చిత్రంలో కూడా నటిస్తోంది. మంచు విష్ణువర్ధన్ బాబుకి సోదరి మణి గా మోసగాళ్ళు సినిమాలో ఆమె కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ లో ఆమె చాలా అందంగా కనిపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఆమె చేతిలో ఇప్పటికే పలు సినిమాలు ఉండగా వాటిలో కొన్నిటిని పక్కన పెట్టేసి మిగతావి తొందరగా పూర్తి చేయాలని కాజల్ అగర్వాల్ యోచిస్తున్నట్టు సమాచారం.


ఐతే కాజల్ అగర్వాల్ విజ్ఞప్తి కొరకు ఆచార్య సినిమా యొక్క షూటింగ్ షెడ్యూల్ చేంజ్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇండియన్ 2 చిత్రం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత మిగతా సినిమాల్లో నటించాలని వద్దా అన్న అంశంపై తన తుది నిర్ణయాన్ని తీసుకోబోతున్నారట. ఈ రెండు భారీ ప్రాజెక్ట్ సినిమాలను పూర్తిచేసి..  ఆ తరవాత సినిమాలకు స్వస్తి చెప్పే యోచనలో ఉన్నారట. అందుకే అడ్వాన్సులు తిరిగిచ్చేస్తున్నారని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కాజల్ అగర్వాల్ లాక్ డౌన్ కి ముందు అనేక ఫోటో షూట్లలో పాల్గొని బాగా డబ్బులు సంపాదించారు. చాలా వాణిజ్య ప్రకటనల్లో కూడా యాక్ట్ చేశారు. ఇప్పటికే ఆమె గ్రాఫ్ చాలా వరకు పడిపోయింది. భవిష్యత్తులో ఆమెకు హీరోయిన్ ఛాన్సులు రాకపోవచ్చు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడం ఇష్టంలేక కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానే సినిమా పరిశ్రమ నుంచి నిష్క్రమించాలన్న యోచనలో ఉన్నట్టు సన్నిహిత వర్గాల టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: