ఇక మరో వైపు ప్రస్తుతం వకీల్ సబ్ సినిమా తో పాటు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరొక పీరియాడికల్ సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారని అలానే ఇందులో ఆయన పాత్రలు రెండూ కూడా ఎంతో అదిరిపోతాయి అని సమాచారం. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూలు అతి త్వరలో ప్రారంభం కాబోతుతుండగా ఇందులో పవన్ కి జోడీగా ఒక ప్రముఖ హీరోయిన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇకపోతే అటు ఆచార్య ఇటు పవన్ క్రిష్ ల సినిమాలు రెండూ కూడా పక్కాగా వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు టాక్. మరోవైపు ఆ రెండు సినిమాల యూనిట్లు కూడా పక్కాగా తమ సినిమాలను ఆ సమయంలోనే రిలీజ్ చేయాలని పట్టుబడుతున్నారని అంటున్నారు. ఇదే కనుక జరిగితే మాత్రం తొలిసారిగా మెగా స్టార్, పవర్ స్టార్ ల మధ్య భారీ బాక్సాఫీస్ యుద్దం తప్పదని అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో ఇది నిజంగా జరుగుతుందో లేదో తెలియాలంటే మరికొద్ది రోజుల వరకు ఓపిక పట్టక తప్పదు....!!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి