కన్నడ నటుడు వసిష్ఠ సింహ ఈ చిత్రంలో హీరోగా చేస్తున్నారు. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంపత్ నంది కథను మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా... అశోక్ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్ మొట్టమొదటిసారి వితౌట్ మేకప్ తో నాచురల్ బ్యూటీ గా సరికొత్తగా కనిపించనున్నారు. సాధారణంగా హీరోయిన్స్ అంటే వెండి తెరపై ఎంతో గ్లామర్ గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించాలి అనుకుంటారు. నిజానికి అది కూడా వారి తదుపరి సినిమాల ఛాన్స్ కు ప్లస్ పాయింట్ అవుతుంది....
ఇలాంటి డి గ్లామరస్ గా కనిపించడం హీరోయిన్స్ కు ఒక ఛాలెంజ్ లాంటిది మరి. ఇటువంటి చిత్రాలలో కథానాయిక పాత్రల గుర్తింపు ప్రధానంగా వారి నటన పై ఆధారపడి ఉంటుంది. నవరసాలను పలికించగల హెబ్బా ఈ సినిమాలో తనేంటో నిరూపించుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు. అందులోనూ ఈమధ్య తెలుగు సినీ పరిశ్రమలో హెబ్బా పటేల్ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి... ఇప్పుడు ఈ చిత్రంతో తిరిగి తన జోష్ ను చూపించనుందో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి