అన్ లాక్ లో బీటౌన్ సెలబ్రెటీలంతా టూరిస్టులుగా మారిపోయారు. హాలీడే ట్రిప్ ల పేరుతో హల్చల్ చేశారు. అలా చేసినవారిలో చోప్రా సిస్టర్స్ మనకు కనిపిస్తారు. అలాగే దంగల్ ఫేం ఫాతిమా ఎలాంటి హడావిడి చేయకుండా కూల్ గా హిమాచల్ ప్రదేశ్ కు పోయి  సెల్ఫ్ క్వారంటైన్ లో కూర్చుంది.

దంగల్ ఫేం ఫాతియా సనా షేక్...లాక్ డౌన్ టైమ్లో ఇంటికే పరిమితమైపోయింది.  ఏం చేసినా సోషల్ మీడియాలో ఒకటి రెండు "త్రో బ్యాక్ పిక్స్" పెట్టి... కూల్ గా కూర్చుంది. అయితే అన్ లాక్ లో మాత్రం బయటకు వచ్చి మిగతావారిలా వేరే దేశాలకు వెళ్లకుండా హిమాచల్ ప్రదేశ్ లోని  బిర్ గ్రామంకు వెళ్లి అక్కడ సెల్ఫ్ క్వారంటైన్ అయ్యింది.

చోప్రా సిస్టర్స్‌ ప్రియాంక, పరిణీతి సైతం అన్‌లాక్‌లో టూర్లు వేశారు. ఇద్దరూ ఈసారి యూరప్‌ వెళ్లారు. అయితే ప్రియాంకా తన హబ్బీ "నిక్‌ జోనాస్‌"తో ఇప్పటికే యుఎస్ లో సెటిలైపోయింది. దీంతో లాక్ డౌన్లో పూర్తిగా యుఎస్ లోనే ఉండిపోయింది. సినిమా షూట్ నిమిత్తం యూరప్ వెళ్లింది.షూట్ లో గ్యాప్ వచ్చినప్పుడల్లా.. గోల్ఫ్ ఆడింది. మరీ గ్యాప్ దొరికితే నిక్ తో జాలీలైఫ్ ను ఎంజాయ్ చేసింది.

 ఇక పరిణీతి చోప్రా తన తల్లి రీనా, సోదరుడు శివంగ్‌తో కలిసి ఇండియా నుంచి యూకే వెళ్లడం జరగింది. అక్కడ లండన్‌ వీధుల్లో మాస్క్‌ ధరించి చక్కర్లు కొట్టింది. షాపింగ్ చేస్తూ లండన్ వీదుల్లో అన్ లాక్ ను ఆస్వాదించింది.



మరింత సమాచారం తెలుసుకోండి: