ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి.కీర్తి సురేష్ "నేను శైలజ" సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయ్యింది.మొదటి సినిమాతోనే ఎంతగానో ఆకట్టుకుంది. తరువాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యింది. తరువాత నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి జాతీయ స్థాయిలో అవార్డు అందుకొని గుర్తింపు తెచ్చుకుంది. అందరి హీరోయిన్ల కాకుండా తన స్టైల్ లో ట్రెడిషనల్ గా కనిపిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ చెన్నై బ్యూటీ.నిజం చెప్పాలంటే కీర్తి సురేష్ ఇప్పుడున్న హీరోయిన్లలో ఎలాంటి గ్లామర్ షో చెయ్యకుండా స్టార్ హీరోయిన్ అయ్యింది.మహానటి కీర్తి సురేష్‌ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది.

లాక్‌డౌన్ సమయంలో ఆమె నటించిన రెండు సినిమాలు ఓటీటీ ద్వారా రిలీజై తీవ్రంగా నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నితిన్‌తో ‘రంగ్‌దే’, మహేశ్‌బాబు సరసన ‘సర్కారు వారి పాట’ సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ‘రంగ్‌దే’ షూటింగ్ ప్రస్తుతం దుబాయిలో జరుగుతోంది. ఈ క్రమంలోనే సినిమా సెట్లో కీర్తి నిద్రపోతుండగా ఫోటో తీసిన నితిన్.. దాన్ని సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్‌ అవుతోందంటూ కామెంట్ చేశాడు.


ఈ సరదా ఫోటో సోషల్‌మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి ఆ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదని గుణపాఠం నేర్చుకున్నా. పగ తీర్చుకుంటా’ అని కామెంట్ చేసింది. దీంతో పాటు దుబాయి‌లోని అద్భుతమైన లొకేషన్లో దిగిన ఫోటోలను కూడా తన ఇన్‌‌స్టాగ్రామ్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: