రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ కు తల్లిగా సీనియర్ నటి నదియా నటించారు. చాలా ఏళ్ళ గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా ఆమె ఈ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క శెట్టి, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ గా నటించారు.


ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ అత్తారింటికి దారేది. అంతకముందు వీరిద్దరి కాంబోలో తెరకెక్కిన జల్సా మంచి హిట్ సాధించిన విషయం తెలిసిందే. అనంతరం తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమా అంతకు మించేలా సక్సెస్ సాధించి వారిద్దరి కాంబినేషన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక ఆ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జోడీగా సమంత అక్కినేని నటించగా సీనియర్ నటి నదియా ఇందులో పవర్ స్టార్ కి అత్తగా నటించారు. కాగా ఆ పాత్రలో ఆమె నటనకు గాను ప్రేక్షకాభిమానుల నుండి మంచి మార్కులు పడ్డాయి.

ఇకపోతే లేటెస్ట్ గా కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమాలో కూడా నదియా ఒక ముఖ్య పాత్ర చేయనున్నట్లు టాక్. కాగా ఈ సినిమాలో నదియా మహేష్ బాబుకి తల్లి పాత్రలో కనిపించనున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథని అలానే అందులోని ఆమె పాత్రని నటి నదియాకి వినిపంచి ఆమె నుండి గ్రీన్ సిగ్నల్ అందుకున్నారట త్రివిక్రమ్. జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా పదేళ్ల గ్యాప్ తరువాత మహేష్, త్రివిక్రమ్ ల కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. కాగా ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తకు సంబంధించి మూవీ యూనిట్ నుండి అధికారికంగా ప్రకటన మాత్రం రావలసి ఉంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: