మహానటి సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్సినిమా తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసింది. ఇక ఈమధ్య తెలుగులో వరుస సినిమాలు చేస్తూ వస్తున్న కీర్తి సురేష్ తనని ఏడిపించిన డైరక్టర్ ను వెంటబడి మరి కొట్టింది. ఏంటి కీర్తి సురేష్ ను ఏడిపించారా.. ఆ డైరక్టర్ ను కీర్తి సురేష్ వెంటపడి కొట్టిందా ఏంటి ఇదంతా అనుకోవచ్చు. కీర్తి సురేష్ చేస్తున్న రంగ్ దే సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె చిన్న నాప్ వేసినప్పుడు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు హీరో నితిన్, డైరక్టర్ వెంకీ అట్లూరి.

ఇంకోసారి షూటింగ్ స్పాట్ లో నిద్రపోకూడదని ఓ గుణపాఠం నేర్పించారని.. కచ్చితంగా పగ తీర్చుకుంటా అని ఆమధ్య కామెంట్ పెట్టింది. ఇక లేటెస్ట్ గా కీర్తి సురేష్ ఆ డైరక్టర్ ను గొడుగుతో సరదాగా వెంటపడి మరి కొట్టిన వీడియో తన ఇన్ స్టాగ్రాం లో షేర్ చేసింది. అనుకున్నట్టుగానే పగ సాధించింది కీర్తి సురేష్. ఆమె చేసిన ఈ పనికి అందరు సూపర్ అనేస్తున్నారు.

షూటింగ్ స్పాట్ లో ఎంత సరదాగా ఉంటుందో కీర్తి పెట్టిన వీడియోని చూస్తే అర్ధమవుతుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న రంగ్ దే సినిమాపై చాలా హోప్స్ పెట్టుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ తో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది అమ్మడు. ఈమధ్య ఓటిటి హీరోయిన్ గా కీర్తి సురేష్ చేసిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి.                                    



మరింత సమాచారం తెలుసుకోండి: