'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ''జాంబీ రెడ్డి'' చిత్రం. ఎంత వైవిధ్యభరితంగా విభిన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ బైట్ ని డిసెంబర్ 5న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారకంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అక్కినేని కోడలు సమంత ఈ ఫస్ట్ బైట్ వీడియోను రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు సమాచారం.ఈ చిత్రంతో తేజ సజ్జ హీరోగా పరిచయం అవుతున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న తేజ...సమంత లీడ్ రోల్ లో నటించిన 'ఓ బేబీ' సినిమాలో ఆమెకు మనవడిగా కనిపించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇప్పుడు ''జాంబీ రెడ్డి'' సినిమా తో హీరోగా రంగ ప్రవేశం చేయనున్నాడు. అందుకు తన బామ్మ సామ్ సాయం తీసుకుంటున్నాడు ఈ కుర్ర హీరో. ఆపిల్ ట్రీ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ 'జాంబీ రెడ్డి' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇది జాంబీ కథాంశంతో వస్తున్న మొట్ట మొదటి తెలుగు సినిమా కాబట్టి మరింత ఉత్కంఠ నెలకొంది..... అందరూ ఈ చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో ఆనంది - దక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కర్నూల్ బ్యాగ్రౌండ్ లో వస్తున్న ఈ ఫిక్షనల్ జాంబీ తెలుగు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని భావిస్తోంది చిత్రబృందం. వీలైనంత త్వరలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకులను అలరించిన తేజ హీరోయిజం చూపి అభిమానులను ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి