తెలుగులో తొలి సినిమా (అర్జున్ రెడ్డి) తోనే బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న నటి షాలిని పాండే... ఈ చిత్రంతో లక్కీ అండ్ టాలెంటెడ్ గర్ల్ అని పేరు సంపాదించుకుంది.  చిత్రంలో ఆమె నటనకు ఫిదా అయ్యారు తెలుగు ప్రేక్షకులు. ఇక యువత అయితే అటు విజయ్ దేవరకొండకు... ఇటు షాలిని  కి ఫుల్ గా కనెక్ట్ అయిపోయారు. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత ఆమెకు అన్ని భాషల నుంచి అవకాశాలు బాగానే దక్కాయి. ఇప్పుడు హిందీ లో తన టాలెంట్ నిరూపించుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే హిందీలో రణ్‌వీర్‌ సింగ్‌తో ‘జయేష్‌ భాయ్‌ జోర్దార్‌’ సినిమాలో నటించగా అది విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇప్పుడు మరో ప్రాజెక్టు తో హిందీ ప్రేక్షకులకు మరింత దగ్గర కాబోతున్నారు షాలిని పాండే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులోనూ అది స్టార్ హీరో తనయుడి చిత్రం లో కావడం విశేషం. బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కొడుకు  జునైద్ ఖాన్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారట. మొదటి సినిమా అయినందున చిత్రాన్ని భారీగానే ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాకు ఆమె ఆల్రెడీ సైన్ చేసినట్లు సమాచారం. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాని  పట్టాలెక్కించబోతున్నట్లుగా బాలీవుడ్ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది.

యశ్‌ రాజ్‌ సంస్థ ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నారు. సిద్ధార్థ్‌ పి. మల్హోత్రా దర్శకత్వంలో తెరకెక్కబోయే ఈ సినిమాలో షాలిని పాండేను హీరోయిన్ పాత్రకు ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రొమాంటిక్‌ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో షాలిని సందడి చేయనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయని ఇక చిత్రాన్ని తెరకెక్కించడమే తరువాయి అని చెబుతున్నారు. ఇలా స్టార్ హీరో సరసన విజయ్ దేవరకొండ  హీరోయిన్ నటించనుంది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్ లో సెటిల్ అయ్యేలా చేస్తుందని ఫీల్ అవుతోందట ఈ హాట్ బ్యూటీ.

మరింత సమాచారం తెలుసుకోండి: