మహేష్ కు స్టార్ ఇమేజ్ తెచ్చిన సినిమా ఒక్కడు. ఈ సినిమా 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా నమ్రత పెట్టిన ఇన్ స్టాగ్రాం పోస్ట్ వైరల్ గా మారింది. మహేష్ కెరియర్ లో ఒక క్లాసిక్ అంటూ చెప్పారు నమ్రత. అయితే సినిమా 18 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పెట్టిన పోస్ట్ ను డైరక్టర్, హీరోయిన్ అందరికి ట్యాగ్ చేసిన నమ్రత నిర్మాత ఎమ్మెస్ రాజుని మర్చిపోయింది. అయితే ఈ విషయం ఎమ్మెస్ రాజుని హర్ట్ అయ్యేలా చేసింది.

నమ్రత పెట్టిన పోస్ట్ కు పొరపాట్లు కొన్నిసార్లు జరుగుతుంటాయి బాబు.. ఒక్కడు గురించి మాట్లాడుతూ నమ్రత గారు నా పేరు మర్చిపోయారని.. అయినా తన సినిమా ఫేవరేట్ అన్నందుకు తనకు సంతోషంగా ఉందని అన్నారు. ఎమ్మెస్ రాజు ఇంతగా ఫీల్ అవుతాడని ఊహించని నమ్రత సింపుల్ గా అతన్ని తన పోస్ట్ కు యాడ్ చేసింది. ఈమధ్యనే డర్టీ హరి సినిమాను డైరెక్ట్ చేసిన ఎమ్మెస్ రాజు పలు ఇంటర్వ్యూస్ లో మహేష్ తో ఒక్కడు సీక్వల్ చేస్తానని చెప్పారు.

ఒకప్పుడు స్టార్ నిర్మాతగా ఉన్న ఎమ్మెస్ రాజు ఆ తర్వాత ఆర్ధికంగా చితికిపోవడంతో కెరియర్ లో వెనకపడ్డారు. ప్రస్తుతం ఆయన డైరక్టర్ గా కెరియర్ కొనసాగించాలని చూస్తున్నాడు. ఎమ్మెస్ రాజు ఆలోచన చూస్తుంటే ఒక్కడు సీక్వల్ అతనే డైరెక్ట్ చేస్తాడని అనిపిస్తుంది. అయితే అతని డైరక్షన్ లో మహేష్ నటిస్తాడా లేదా అన్నది మాత్రం చెప్పడం కష్టం.




మరింత సమాచారం తెలుసుకోండి: