పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అభిమానులందరిని  వరుసగా సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. మొన్నటి వరకు వరకు సినిమాల  ను వదిలి రాజకీయాల వైపు వెళ్లిన పవన్ కళ్యాణ్ సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు అన్న విషయం తెలిసిందే కానీ ప్రస్తుతం సినిమాలలో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చేందుకు ముందుకు వచ్చారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.   బాలీవుడ్లో మంచి విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి టీజర్ కూడా విడుదల అయింది అన్న విషయం తెలిసిందే.  అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. చాలా మంది దర్శకులు  కూడా పవన్ కళ్యాణ్ కు  వినిపిస్తుండగా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు అన్న విషయం తెలిసిందే.



 ఇక ఆ తర్వాత గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ విజయాన్ని పవన్ కళ్యాణ్ కి అందించిన హరీష్ శంకర్ తో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇప్పుడు మరో సెన్సేషనల్ దర్శకుడికి కూడా పవర్ స్టార్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో  సైరా నరసింహారెడ్డి అనే హిస్టారికల్ సినిమాను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారిన సురేందర్ రెడ్డితో పవన్ కళ్యాణ్ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల సురేందర్ రెడ్డి తన కథను పవన్ కళ్యాణ్ వినిపించగా కథ నచ్చడంతో వెంటనే ఓకే చేశారట పవన్ కళ్యాణ్. కాగా ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో సినిమా తెరకెక్కిస్తున్న సురేందర్ రెడ్డి ఇది పూర్తవగానే పవన్ కళ్యాణ్ సినిమా లైన్ లో  పెట్టనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: