యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మరొక నటుడు మెగాపవర్ స్టార్ రాం చరణ్ తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఆల్మోస్ట్ షూటింగ్ తుది దశకు చేరుకుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

హరిక హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై నందమూరి కళ్యాణ్రామ్, సూర్యదేవర రాధాకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందించనున్నారు. ఇక ఇటీవల ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత సినిమా మంచి సక్సెస్ సాధించి వీరిద్దరి కాంబినేషన్ కి మంచి క్రేజ్ తెచ్చిపెటింది. దానితో ప్రస్తుతం తెరకెక్కనున్న ఈ మూవీపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అందరిలోనూ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఒక స్టార్ హీరోయిన్ ఎన్టీఆర్ కి జోడీగా నటించనున్న ఈ సినిమా మంచి పొలిటికల్ సెటైరికల్ మూవీగా తెరకెక్కనుందని అలానే ఈ మూవీకి అయినను పోయి రావలె హస్తినకు అనే టైటిల్ ని కూడా యూనిట్ పరిశీలిస్తున్నట్లు కొద్దిరోజుల నుండి పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. 

అయితే ఈ సినిమా విషయమై లేటెస్ట్ గా కొన్ని ఫిల్మ్ నగర్ వర్గాల నుండి మా ఏపీ హెరాల్డ్ సంస్థకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా యొక్క స్టోరీ ని ఇటీవల త్రివిక్రమ్ మార్చేసారని, ముందుగా అనుకున్న లైన్, ఆపై పూర్తి స్క్రిప్ట్ గా రూపొందించిన తరువాత అది హీరో తో పాటు నిర్మాతలకు కూడా అంతగా నచ్చలేదని, దానితో మరొక స్టోరీ లైన్ ని ఎన్టీఆర్ కి వినిపించి ఆమోదం అందుకున్న త్రివిక్రమ్, ప్రస్తుతం దాని పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో నిమగ్నమై ఉన్నారని అంటున్నారు. అతి త్వరలో దానిని పూర్తి చేసి సినిమాని ఎటి పరిస్థితుల్లో మార్చి మొదటి వారంలో పట్టాలెక్కించి వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రీలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో పూర్తి వాస్తవాలు తెలియాలి అంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు..... !!

మరింత సమాచారం తెలుసుకోండి: