ప్రస్తుతం బుల్లితెర పై డాన్సు లకు కేరాఫ్ అడ్రస్ గా ఎంటర్ టైన్ మెంట్ కు చిరునామాగా మారి పోయింది డాన్స్ రియాల్టీ షో ఢీ. ఎన్నో ఏళ్ల నుంచి టాప్  రేటింగ్ ను  సొంతం చేసుకుంటూ అసలు సిసలైన డాన్స్ కి చిరునామాగా మారిపోయింది ఈ షో. ఢీ షో వచ్చిన తర్వాత ఎన్నో డాన్సులు వచ్చినప్పటికీ కూడా ఈ షో  ముందు నిలవలేకపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒకప్పుడు ఢీ  అంటే అసలు సిసలైన డాన్స్ పర్ఫామెన్స్ లతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ ఉండేది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో పాటు ఆకట్టుకునే కామెడీ తో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే  ఎంటర్టైన్మెంట్ తో టాప్ రేటింగ్ తో దూసుకుపోతుంది.



 ఇక ప్రతి వారం కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ల తో బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదలై  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అందరూ కూడాలేచి నిలబడి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆ తరువాత సుడిగాలి సుధీర్ హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ తో కలిసి అదిరిపోయే పంచులతో డైలాగులతో అలరించారు అనే చెప్పాలి.



 ఇకపోతే ఎప్పుడు ఢీ షోలో  నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే శేఖర్ మాస్టర్ ఇటీవలే విడుదలైన ప్రోమో లో  మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా ఒక కంటెస్టెంట్ అమ్మ అమ్మ నేను పసివానమ్మ.. అంటూ రఘువరన్ బీటెక్ సినిమా లో నుంచి ఒక పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ పర్ఫామెన్స్ చూస్తున్నంతసేపు అందరూ రెప్ప  కూడా వాల్చ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పర్ఫామెన్స్ పై శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో .. ఇప్పటికి కూడా తాను ఎవరికైనా కాల్ చేస్తే అమ్మ అని పిలుస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక శేఖర్ మాస్టర్ ని చూసిన రష్మీ బోరున ఏడ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: