ఇక ప్రతి వారం కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ల తో బుల్లితెర ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదలై సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఒక కంటెస్టెంట్ చేసిన డాన్స్ పర్ఫార్మెన్స్ కి జడ్జెస్ అందరూ కూడాలేచి నిలబడి ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఆ తరువాత సుడిగాలి సుధీర్ హైపర్ ఆది యాంకర్ ప్రదీప్ తో కలిసి అదిరిపోయే పంచులతో డైలాగులతో అలరించారు అనే చెప్పాలి.
ఇకపోతే ఎప్పుడు ఢీ షోలో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే శేఖర్ మాస్టర్ ఇటీవలే విడుదలైన ప్రోమో లో మాత్రం కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇటీవల విడుదలైన ప్రోమో లో భాగంగా ఒక కంటెస్టెంట్ అమ్మ అమ్మ నేను పసివానమ్మ.. అంటూ రఘువరన్ బీటెక్ సినిమా లో నుంచి ఒక పాట పై డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ పర్ఫామెన్స్ చూస్తున్నంతసేపు అందరూ రెప్ప కూడా వాల్చ లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఈ పర్ఫామెన్స్ పై శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ ఇస్తున్న సమయంలో .. ఇప్పటికి కూడా తాను ఎవరికైనా కాల్ చేస్తే అమ్మ అని పిలుస్తాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇక శేఖర్ మాస్టర్ ని చూసిన రష్మీ బోరున ఏడ్చేసింది.