గత ఏడాది అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కమర్షియల్ ఎంటర్ టైనర్ సరిలేరు నీకెవ్వరు ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఆ మూవీతో భారీ సక్సెస్ ని అందుకున్నారు. అంతకు ముందు వరుసగా రెండు విజయాలు అందుకున్న సూపర్ స్టార్ సరిలేరు తో మూడో విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకొని ఏకంగా కెరీర్పరంగా హ్యాట్రిక్ నమోదు చేశారు.

ఇక ప్రస్తుతం మహేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట. గీతగోవిందం ఫేమ్ పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమా ద్వారా తొలిసారిగా మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతాన్ని మది ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. ఇక ఇటీవల దుబాయ్ లో ప్రారంభమైన ఈ సినిమా యొక్క ఫస్ట్ షెడ్యూల్ రెండు రోజుల క్రితం పూర్తయింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు పరుశురాం ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని ఎంతో పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని సమాచారం.

అసలు మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో మహేష్ బాబు ఒక ఫైనాన్షియర్ గా కనిపించనున్నారని అలానే సినిమాలో ఆయన పాత్ర రెండు రకాల విభిన్న షేడ్స్ తో కొనసాగుతుందని టాక్. ఆ పాత్ర కోసమే మహేష్ బాబు పూర్తిగా లాంగ్ హెయిర్ ను పెంచడంతోపాటు బాడీ పరంగా ఎంతో మంచి ఫిట్నెస్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఇక ఈ మూవి యొక్క సెకండ్ షెడ్యూల్ గోవాలో జరగనుండగా ఈ షెడ్యూల్లో రెండు భారీ యాక్షన్ సన్నివేశాలతో పాటు ఒక సాంగ్ ను కూడా చిత్రీకరించనుందట యూనిట్. మరి 2022 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఏ రేంజి సక్సెస్ ని అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని నెలల వరకు వెయిట్ చేయక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: