ప్రగ్యా జైస్వాల్.. కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. 2015 లో తెలుగులో వచ్చిన మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. కానీ ఈ మూవీ పెద్దగా విజయం సాదించకపోయేసరికి అమ్మడి పేరు పెద్దగా వినపడలేదు. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాలో నటించి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో రాచకొండ సీతాదేవి గా తన కట్టుబొట్టు తో ఆకట్టుకుంది.

ఆ తర్వాత ఓం నమో వేంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం , జయ జానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర, సైరా వంటి సినిమాల్లో నటించినప్పటికీ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఇదే సమయంలో ఇతర భాషల హీరోయిన్స్ తెలుగు లో ఎంట్రీ ఇవ్వడం , వారు నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలు సాధించడం తో ప్రగ్యా ను పట్టించుకునేవారు కరవయ్యారు.

దీంతో తమిళ్ , హిందీ భాషలపై ఫోకస్ పెడుతూనే సోషల్ మీడియా లో రెచ్చిపోతుంది. తనలో మరో యాంగిల్ ఉందని , అందాల విందుకు కంచె తెచ్చినట్లు చెప్పకనే చెపుతూ హాట్ హాట్ షూట్స్ తో రెచ్చిపోతుంది. ఈమె చేస్తున్న షూట్స్ చూసి నెటిజన్లు ఈమె అందానికి దాసోహం అవుతున్నారు. ప్రస్తుతం ఈమె తెలుగు లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కతున్న సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమాను డైమెండ్ రత్నబాబు డైరెక్ట్ చేస్తుండగా.. ఈ సినిమాలో ఓ పోలీస్ అధికారి పాత్రలో ప్రగ్యా జైస్వాల్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మూవీ ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తం తెరకెక్కిస్తున్నారు.                     

మరింత సమాచారం తెలుసుకోండి: