ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... ప్రముఖ కన్నడ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మేనల్లుడు దివంగత నటుడు చిరంజీవి సర్జా తమ్ముడు ధృవ్ సర్జా హీరోగా నంద కిషోర్ డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా "పొగరు" .. డి.ప్ర‌తాప్ ‘పొగరు’ నిర్మించాడు. ఇక ఈ సినిమాకి చంద‌న్ శెట్టి, అర్జున్ జ‌న్యలు సంగీతం అందించారు. ఇక వీరి సంగీతంలో రూపొందిన ‘కరాబు మైండు కరాబు’ అనే ఒక్క పాట యూ ట్యూబ్ లో పెద్ద హిట్ అయ్యి ఈ డబ్బింగ్ సినిమా పై అంచనాలను పెంచి ఈ సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది. కానీ ఫిబ్రవరి 19న విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చెయ్యడంలో విఫలమయ్యింది అనే చెప్పాలి. అయినప్పటికీ రష్మిక వంటి స్టార్ హీరోయిన్ క్రేజ్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ నే నమోదు చేసింది.కలెక్షన్స్ మొదట్లో పర్వాలేదనిపించింది.


ఇక ఈ సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే...‘పొగరు’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.3.7కోట్ల బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.5 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం 2.02 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఇంకా 2.27 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఓ డబ్బింగ్ సినిమాకి ఈ ఓపెనింగ్స్ చాలా ఎక్కువే. కానీ బయ్యర్లు ఎక్కువ రేట్లకు కొనుగోలు చేశారు కాబట్టి.. వీక్ డేస్ లో సో సోగా పెర్ఫార్మ్ చేస్తే కుదరదు మరి.అయితే బ్యాలన్స్ వసూల్ చెయ్యడం కష్టమనే చెప్పాలి. ఒక్క సీడెడ్ లో మాత్రమే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం ఓ విశేషంగా చెప్పుకోవాలి.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి....

మరింత సమాచారం తెలుసుకోండి: