మహేష్ బాబు హీరోయిన్ ఓ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారు. డబ్బులు ఇస్తానని నమ్మించి చివరికి చేతులెత్తేశారు అంటూ ఆమెపై అజయ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. నాని సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన అమీషా పటేల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఈమె తెలుగులో పలు సినిమాలలో కూడా నటించారు. బద్రి సినిమాలో పవన్ పక్కన ఆడిపాడింది అమీషా. అలాగే  ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌ర‌సింహా చిత్రంలో అమీషా న‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈమె కోట్ల రూపాయ‌ల చెక్ బౌన్స్ కేసులో ఇరుక్కోవడం సంచలనంగా మారింది.

అజ‌య్ కుమార్ సింగ్ అనే వ్య‌క్తి 2017లో అమీషాను క‌లిసి సినిమాల్లో పెట్టుబడి పెట్టేందుకు గాను ఒప్పందం కుదుర్చుకున్నారు. అమీషా పటేల్ కూడా ఒప్పుకున్నారు. దేశీ మ్యాజిక్ అనే చిత్రం కోసం అమీషా, అజ‌య్‌ని రిటర్న్స్ బాగా వస్తాయి అని నమ్మించి బ‌ల‌వంతంగా పెట్టుబ‌డి పెట్టేలా ప్రేరేపించిందని.. ఇందుకోసం తాను అమీషా అకౌంట్‌కి రూ.2.5 కోట్లు బ‌దిలీ చేశానని అజ‌య్ పిటిష‌న్‌లో పేర్కొన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయిందని... ఆ తర్వాత తన డబ్బులు తనకు తిరిగి ఇవ్వాలంటూ అమీషాని కోరగా తాను చెక్ ఇచ్చినట్లుగా తెలిపాడు. అయితే అమీషా తనకు ఇచ్చిన ఆ చెక్ బౌన్స్ అయ్యింద‌ని ఆరోపించారు అజయ్.

అయితే ఎలాగైనా అమీషా నుండి తన డబ్బు తనకు తిరిగి ఇప్పించాలని కోర్టును ఆశ్రయించాడు. తనను మోసం చేసిన అమీషాకు కోర్టు సరైన బుద్ధి చెప్పాలంటూ పేర్కొన్నాడు. అయితే కరోనా నేపథ్యంలో ఈ పిటిషన్ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపింది జార్ఖండ్ హైకోర్టు. ఇరు వర్గాల వారి వాదనలను విన్న న్యాయమూర్తి వారి వాద‌న‌ల‌కు సంబంధించి రెండు వారాల్లో రాత పూర్వ‌క స‌మాధానం కావాల‌ని సూచించినట్లు స‌మాచారం. కాగా అమీషా పటేల్ ఇప్పుడు ఈ కేసు నుండి ఎలా బయట పడతారు అన్న చర్చ మొదలయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: