మళయాళంలో సూపర్ హిట్ సీక్వల్ మూవీస్ గా వస్తున్న దృశ్యం సినిమాలకు స్పెషల్ క్రేజ్ వచ్చింది. జార్జ్ కుట్టి తన ఫ్యామిలీని కాపాడుకునే క్రమంలో ఓ మర్డర్ మిస్టరీ నుండి వారిని ఎలా తప్పించాలని అనుకున్నాడు దృశ్యం కథ. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా జార్జ్ కుట్టి తెలివిగా ఆ కేసు గురించి ఎలాంటి ఆధారాలు లేకుండా చేస్తాడు. అయితే దృశ్యం 2 ఇంకాస్త క్రేజీగా వచ్చింది.

దృశ్యం ను కొనసాగిస్తూ వచ్చిన ఈ పార్ట్ 2 కూడా సూపర్ హిట్ అయ్యింది. సినిమా ఎక్కడ ఆగిందో అక్కడ నుండే ఈ సినిమా మొదలవుతుంది. సీక్వల్ కూడా అదరగొట్టేలా చేశారు. ఇక ఈ సినిమా డైరక్టర్ జీతు జోసెఫ్ దృశ్యం 2ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా జరిగిన ఇంటర్వ్యూస్ లో జార్జ్ కుట్టి నిజంగా ఉన్నాడని చెప్పాడు. వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ సినిమా చేసినట్టు చెప్పుకొచ్చారు.

అంతేకాదు జార్జ్ కుట్టి సినిమా పిచ్చి తన తండ్రిని చూసి రాశానని చెప్పారు. సినిమాలో ప్రతి పాత్ర నిజ జీవితానికి దగ్గరగా ఉంటుందని చెప్పాడు. అయితే దృశ్యం కథ లానే జార్జ్ కుట్టి నిజంగానే అలా చేశాడని.. కాకపోతే అతను పోలీసులకు దొరికాడని చెప్పాడు. మొత్తానికి జార్జ్ కుట్టి పాత్రతో జీతు జోసెఫ్ తన సత్తా చాటుతున్నాడు. మోహన్ లాల్ లీడ్ రోల్ లో నటించిన ఈ సినిమా అమేజాన్ ప్రైం లో రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ప్రైం లో ఈ సినిమా చూసిన అందరు సినిమా సూపర్ హిట్ అనేస్తున్నారు. దృశ్యం సీక్వల్స్ ఇంకా చాలా ఉన్నాయని డైరక్టర్ జీతు జోసెఫ్ చెప్పారు.                                   



మరింత సమాచారం తెలుసుకోండి: