తమిళ స్టార్ హీరో రాకింగ్ స్టార్ రాఖీ నటించిన కే జి ఎఫ్ సినిమా  ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కేవలం తమిళ చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చలన చిత్ర పరిశ్రమలోని అన్ని భాషల్లో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది  సినిమా  .  ఈ సినిమాని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన తీరు తో అటు విమర్శకుల కాదు ప్రేక్షకులు సైతం ఫిదా అయిపోయారు అని చెప్పాలి . కే జి ఎఫ్ సినిమా లోని ప్రతి ఒక్క సన్నివేశం కూడా ఎంతో ఉత్కంఠభరితంగా ప్రేక్షకులందరినీ కూడా సినిమాలోలీనం చేసే విధంగా ఉంటుంది.  మైనింగ్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించింది.


 కే జి ఎఫ్ సినిమా అదిరిపోయే విజయం సాధించడంతో ఇక ఈ సినిమాకు సీక్వెల్ తీయడానికి చిత్రబృందం నిర్ణయించింది. కేజిఎఫ్ సీక్వెల్ కోసం ప్రస్తుతం అభిమానులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ తో అభిమానులు అందరిలో మరింత అంచనాలు పెరిగిపోయాయి చెప్పాలి. ఇక ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తుండటం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలను హైదరాబాదులోనె దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది


 అయితే కే జి ఎఫ్ చాప్టర్ 2 క్లైమాక్స్ కి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కే జి ఎఫ్ వన్ లో తన తల్లి చెప్పినట్లుగానే రాఖీ ధనవంతుడు గానే చనిపోతాడని అలా కే జి ఎఫ్ కథ అంతమవుతుంది అన్న ప్రచారం మొదలైంది. అయితే ఈ వార్త అటు రాఖీ బాయ్ అభిమానులను మాత్రం ఆందోళనకు గురిచేస్తోంది. కే జి ఎఫ్ చాప్టర్ 2 లో నిజంగానే రాఖీ బాయ్ పాత్ర ముహుస్తుందా అలా జరగక పోతే బాగుండు అని అభిమానులు భావిస్తున్నారు అయితే ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాలంటే మాత్రం సినిమా విడుదల అయ్యేంత వరకు ఆగాల్సిందే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: