కరోనా సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూ ఉండగానే పెద్ద సినిమాల షూటింగ్ షెడ్యూళ్ళ తేదీలు ఖరారు అవుతున్నాయి. జూన్ పది నాటికి కరోనా తగ్గుముఖం పడుతుందని షూటింగ్ లు మొదలు అవుతాయాయి అన్న అంచనాలు వేస్తున్నారు. ఈ ప్లాన్ కు అనుగుణంగా బడా సినిమాలు అన్ని తమ సినిమాల షెడ్యూళ్ళను ప్లాన్ చేసుకుంటున్నాయి.


అయితే టాప్ హీరోల  షూటింగ్ లు ప్రారంభమైనా వారి  సినిమాల విడుదల ఎప్పటి నుంచి అన్నది సమాధానం లేని ప్రశ్నగా మారింది. జూలై లో లేదంటే ఆగష్టు లో థియేటర్లు తెరచుకుంటాయి అన్న అంచనాలు వస్తున్నాయి. అయితే ఈసారి థియేటర్స్ ఓపెనింగ్ విషయంలో ప్రభుత్వాలు అంత తొందరపడవు అని అంటున్నారు.   సెకండ్ వేవ్ అదుపులోకి వచ్చినప్పటికి మూడో వేవ్ విషయంలో స్పష్టత వచ్చే వరకు ఈసారి థియేటర్స్ తెరుచుకోవు అంటున్నారు.


ఒకవేళ థియేటర్స్ తెరిచినా ముందుగా 50 శాతం సిటింగ్ తోనే అనుమతి ఇచ్చి ఆ నిబంధనలు జనవరి వరకు కొనసాగిస్తారు అని అంటున్నారు. ఈ అంచనాలు నిజం అయితే  2021 లో ఇక పెద్ద సినిమాలు ఉండకపోవచ్చు. కేవలం 30 - 40 కోట్ల బడ్జెట్ లో తయారైన సినిమాలు మాత్రమే ఈ సంవత్సరం అంతా విడుదల అవుతాయి అని అంటున్నారు.


‘ఉప్పెన’ ఇచ్చిన ధైర్యంతో ముందుగా ‘లవ్ స్టోరీ’ ‘టాక్ జగదీష్’ వస్తాయని  అంటున్నారు. అయితే ‘ఆచార్య’ ‘రాథేశ్యామ్’ ‘పుష్ప’ ‘సర్కారు వారి పాట’ ‘అఖండ’ ‘హరహర మహాదేవ్’ లాంటిభారీ సినిమాలు వెయిటింగ్ లిస్టులో ఉంటాయి కాబట్టి ఈ వెయిటింగ్ లిస్టు క్లియర్ కాకుండా ‘ఆర్ ఆర్ ఆర్’ కు లైన్ క్లియర్ కాదని దీనితో రానున్న రోజులలో టాప్  హీరోల సినిమాలకు సంబంధించి విపరీతమైన కన్ఫ్యూజన్ కొనసాగుతూ సుమారు 2వేల కోట్ల  పెట్టుబడి బ్లాక్ అయి భారీ సినిమాల నిర్మాతలకు అనేక కష్టాలు రాబోతున్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: