బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ బాలీవుడ్ బాద్షా గా కొనసాగుతున్నాడు షారుక్ ఖాన్.  తనదైన శైలిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు నవ్విస్తూ, అలరిస్తూ  దూసుకుపోతున్నాడు.  గత కొన్ని రోజుల నుంచి మాత్రం షారుక్ ఖాన్ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. షారుక్ ఖాన్ హీరోగా  అనుష్క శర్మ, కత్రినాకైఫ్ హీరోయిన్లుగా జీరో అనే సినిమా 2018 లో విడుదలయింది.  ఈ సినిమాలో మరుగుజ్జు పాత్రలో నటించాడు షారుక్ ఖాన్.  విభిన్న కథాంశంతో కూడిన సినిమా కావడంతో ఈ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.



 కానీ ఈ సినిమా విషయంలో ఊహించింది కాస్త తారుమారయ్యింది. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొడుతుంది అనుకుంటే ఈ సినిమా బొక్క బోర్లా పడి పోయింది.  కనీస వసూళ్లు కూడా రాబట్ట లేక డిజాస్టర్ గా మిగిలింది షారుక్ ఖాన్ జీరో సినిమా.  ఇక ఈ సినిమాతో నిరాశలో మునిగిపోయిన షారుక్ ఖాన్ ఆ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చారు. గత మూడేళ్ళ నుంచి షారుక్ ఖాన్ ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. దీంతో అభిమానులు అందరూ నిరాశలో మునిగిపోయారు.  సోషల్ మీడియాలో కూడా షారుఖాన్ అంతగా యాక్టివ్గా లేకపోవడంతో అభిమానులు ఆందోళన చెందారు.



 షారుక్ ఖాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే షారుక్ అభిమానులందరికీ శుభవార్త చెప్పారు. మాసిన గడ్డంతో ఉన్న తన ఫోటోని పోస్ట్ చేసిన షారుక్ ఖాన్ ఇక గడ్డం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఒక కామెంట్ జతచేశారు. షారుక్ ఖాన్ షేర్ చేసిన పోస్టు చూసి అభిమానులు అందరూ మురిసి పోతున్నారు. షారుఖ్ వరుసగా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యారు అని భావిస్తున్నారు.  ఇక దర్శకనిర్మాతలు కూడా షారుక్ ఖాన్ దగ్గరికి క్యూ కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: