ఇప్పటివరకు జనాలు గుడిలో ఉండే దేవుడు ఎలా ఉంటాడో చూశారో లేదో తెలియదు కానీ..  కరోనా వైరస్   సమయంలో మాత్రం కలియుగ ప్రత్యక్ష దైవాన్ని ప్రతిరోజూ చూస్తున్నారు అందరు.  గుడిలో ఉండే దేవుడు అడిగితే అయిన వరాలు ఇస్తాడో లేదో తెలియదు కానీ ప్రత్యక్షంగా జనం కోసం కదిలిన ఈ దేవుడు మాత్రం అడగకుండానే ఎన్నో వరాలు ఇచ్చేస్తున్నాడు. గత ఏడాది కరోనా వైరస్ అనే రక్కసి భారత్లో వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఇక ఇప్పటి వరకు.. ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆపద్బాంధవుడిగా మారిపోయాడు సినీనటుడు సోనుసూద్




 భారత ప్రజానీకం మొత్తం సోను సూద్ పేరెత్తితే చాలు చేతులెత్తి మొక్కుతుంది అంటే సోనూసూద్ చేస్తున్న సేవలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.  రీల్ లైఫ్ లో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం హీరోగా మారిపోయాడు.  అడగనిదే అమ్మయినా పెట్టదు అని చెబుతారు కానీ సోను సూద్ మాత్రం అడగకపోయినా అన్ని రకాల సహాయాలు చేస్తున్నాడు. ఇప్పటికే సహాయం కావాలన్నా ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ  గొప్ప మనసు చాటుకుంటున్నాడు. దానవీరశూరకర్ణ అనే మాట పుస్తకాల్లో మాత్రమే చదువుకున్నాం.. కాని సోనూసూద్ ని చూస్తుంటే.. ఇక ఈ పదం సోనూసూద్ కి మాత్రమే వర్తిస్తుంది అనిపిస్తుంది.



 ఇప్పటికే ఎన్నో మంచి పనులతో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్న సోను సూద్ ఇటీవలే మరో గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. ఐఏఎస్ కావాలని ఆశ ఉన్నప్పటికీ పేదరికం కారణంగా చివరికి నిరాశతో ఉండే విద్యార్థులందరికీ అండగా నిలబడేందుకు సిద్ధమయ్యాడు.  ఐఏఎస్ కావాలని ఆశ పడుతున్న వారికి 'సంభవం' అనే కార్యక్రమం పేరుతో ఆర్థికంగా సహకరించేందుకు ముందుకు వచ్చాడు. ఈ విషయాన్ని ఇటీవలే సోనుసూద్ తన సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చాడు. మీరు ఐఏఎస్ కావాలనుకుంటే మీ బాధ్యత మేం తీసుకుంటాం.. ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 30వ తారీకు వరకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: