అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ పుష్ప సినిమా పై భారత దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. శేషాచలం అడవుల నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానున్నది. ఈ చిత్రాన్ని మొదటిగా ఆగస్టు 13వ తేదీన విడుదల చేయాలని చిత్రబృందం భావించింది కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల తేదీ మారే అవకాశం ఉంది. 160 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, మలయాళం, తమిళం, హిందీ కన్నడ భాషలలో ఏక కాలంలోనే విడుదల కానుంది. ఒక కూలీ.. ఎర్రచందనం స్మగ్లర్ గా ఎలా మారాడు అనేది ఈ సినిమాలోని మెయిన్ పాయింట్ అని తెలుస్తోంది.

అయితే ఇప్పటివరకు పుష్ప సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్స్ విడుదలయ్యాయి. అవన్నీ కూడా పుష్ప చిత్రంపై అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే సుకుమార్ శిష్యుడు, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సనా పుష్ప సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన క్లబ్‌హౌస్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నేను పుష్ప పార్ట్ 1 సినిమా చూశాను.. ఈ ఒక్క చిత్రం 10 కేజీయఫ్‌లకు సమానంగా అనిపించింది. హీరో క్యారెక్టరైజేషన్, ఎలివేషన్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి," అని చెప్పుకొచ్చారు.

అయితే బుచ్చిబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి కేజీయఫ్‌ చాప్టర్ 1 సినిమా ని ప్రశాంత్ నీల్ హై రేంజ్ లో తీశారు. రాకింగ్ స్టార్ యష్ తన ఫర్ఫార్మెన్స్ తో కేక పుట్టించారు. ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చిన టాప్ యాక్షన్ చిత్రాల్లో కేజీయఫ్‌ ఒక ప్లేస్ సంపాదించుకుంటుంది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి బ్లాక్ బస్టర్ హిట్ సినిమాతో పోల్చుతూ సుకుమార్ చేసిన వ్యాఖ్యలు బన్నీ సినిమా పై విపరీతంగా హైప్ పెంచుతున్నాయి. బుచ్చి బాబు చెప్పినట్టు పుష్ప పార్ట్ 1.. 10 కేజీయఫ్‌ లకు సమానంగా నిలిస్తే అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయికి పోతుందో ఊహించడం కూడా కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: