బాలీవుడ్ అగ్రభామలు టాలీవుడ్ ఆఫర్ అనగానే హీరోకి సమానంగా రెమ్యునరేషన్ అడుగుతారు. ఎలాగు మన వాళ్లు అంత ఇచ్చుకోలేరు కాబట్టి వాళ్లని కాదని సౌత్ భామలకే ఫిక్స్ అవుతారు. అయితే వాళ్లకి తెలియని విషయం ఏంటంటే బాలీవుడ్ ని ఏలిన ఒకప్పటి తార శ్రీదేవి తెలుగు, తమిళంలో పాపులర్ అయ్యాకనే హిందీలోకి వెళ్లింది. అయితే శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లాక అక్కడ కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది.
అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. బాలీవుడ్ భామలు సైతం సౌత్ సినిమాల మీద ముఖ్యంగా తెలుగు సినిమాల మీద ఆసక్తి చూపిస్తున్నారు. కత్రినా కైఫ్ ఆల్రెడీ తెలుగులో రెండు సినిమాల్లో చేసింది. ఆర్.ఆర్.ఆర్ లో అలియా భట్ కూడా నటిస్తుంది. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీలో దీపికా పదుకొనెని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. మొత్తానికి పంథా మార్చుకున్న బాలీవుడ్ భామలు ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా రెమ్యునరేషన్ అంచనాలు లేకుండా సినిమాలు చేస్తున్నారు. బాహుబలితో తెలుగు సినిమా బాలీవుడ్ స్థాయికి ఎదిగిందని ప్రూవ్ అయ్యింది. అందుకే తెలుగు సినిమాల మీద బాలీవుడ్ భామల ఆసక్తి పెరిగింది. అందుకే ఇప్పుడిప్పుడే బాలీవుడ్ భామలు కూడా టాలీవుడ్ ఆఫర్లంటే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రానున్న రోజుల్లో బాలీవుడ్ భామలు తెలుగులో మరెన్ని సినిమాలు చేసే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.