ప్రస్తుతం వైవిధ్యభరిత పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విజయ్ సేతుపతి క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హీరో నుంచి విలన్ వరకు కీలక పాత్ర ఏదైనా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించడంలో ఆయన నెంబర్ వన్. తెలుగు, తమిళం మరియు హిందీ ఇలా పలు భాషల్లో నటిస్తూ సత్తా చాటుతున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. అనతికాలంలోనే ఎంతో ఫాలోయింగ్ పెంచుకున్న ఈ హీరో తమిళ్ లో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని చిత్రాలకు వర్క్ చేసి మల్టీ టాలెంటెడ్ హీరో అని అనిపించుకున్నారు. సైరా నరసింహారెడ్డి సినిమాతో నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన విజయ్ సేతుపతి ఉప్పెన చిత్రంతో మరో మంచి పాత్రను పోషించి టాలీవుడ్ లో ఫుల్ ఫేమస్ అయ్యారు.

అయితే ఇప్పుడు తెలుగులోనూ నిర్మాతగా మారాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మెగా హీరోతో నిర్మాతగా తన మొదటి తెలుగు సినిమా చేయాలని ఆయన భావిస్తున్నారట. ఉప్పెన చిత్రంతో  వైష్ణవ్ తేజ్ టాలెంట్ ను గమనించిన విజయ్ సేతుపతి ఇప్పుడు ఈ మెగా యంగ్ హీరో తోనే నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడానికి చూస్తున్నట్లు తెలుస్తోంది. అంతే కాదు ఈ సినిమాను విజయ్ సేతుపతే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే ఓ ప్రముఖ తెలుగు డైరెక్టర్ తో కలసి డైరెక్షన్ బాధ్యతలు పంచుకొని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట విజయ్ సేతుపతి.

ఇలా ఒకే సారి నిర్మాతగా మరియు డైరెక్టర్ గా మారి మెగా హీరోతో సందడి చేసేందుకు విజయ్ సేతుపతి సిద్ధమవుతున్నట్లు జోరుగా టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తి క్లారిటీ వచ్చేవరకూ వెయిట్ చేయక తప్పదు. మరి తెలుగులో నిర్మాతగా విజయ్ సేతుపతి రాణిస్తాడా ? అన్నది తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: