స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా పుష్ప. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ముందు ఒక పార్ట్ గానే అనుకున్నా ఇప్పుడు ఆ సినిమా రెండు పార్టులుగా రావడం పక్కా అని తెలుస్తుంది. పుష్ప తగ్గేదిలే అంటూ ఇంట్రడక్షన్ ప్రోమోతోనే అదరగొట్టిన అల్లు అర్జున్ సినిమాతో సంచలనాలు సృష్టించడానికి సిద్ధమయ్యాడు. సినిమా గురించి కొన్ని సంచలన విషయాలు ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేస్తున్నాయి. పుష్ప సినిమా రెండు పార్ట్ లకు రెండు టైటిల్స్ పెడుతున్నారని టాక్. మొదటి పార్ట్ కు పుష్ప ఉంచినా రెండో పార్ట్ కు వేరే టైటిల్ ఆలోచిస్తున్నారని తెలుస్తుంది.

ఇక సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ మొదటి పార్ట్ లోనే ఆ క్యారక్టర్ ఎండ్ అవుతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 లో విలన్ క్యారక్టర్ ఎండ్ అవుతుందట. మరి పార్ట్ 1 ఎండింగ్ లోనే విలన్ అంతమైతే ఇక కథ ఏముంటుంది అనుకోవచ్చు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ సినిమాలో ఒక్కడు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది విలన్స్ ప్లాన్ చేశాడట సుకుమార్. ఈ విలన్స్ అందరిని పుష్పరాజ్ ఒక ఆట ఆడుకుంటాడని టాక్. ఇప్పటికే సినిమాలో బోట్ ఫైట్ హైలెట్ గా ఉంటుందని లీకులు రాగా సినిమాపై ఇంకా అంచనాలు పెంచేలా ఈ న్యూస్ వైరల్ గా మారింది.

పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాకు దేవి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ఉంటుందని తెలుస్తుంది. పుష్ప రాజ్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారుతాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: