ఇక సినిమాలో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాజిల్ మొదటి పార్ట్ లోనే ఆ క్యారక్టర్ ఎండ్ అవుతుందని తెలుస్తుంది. పుష్ప పార్ట్ 1 లో విలన్ క్యారక్టర్ ఎండ్ అవుతుందట. మరి పార్ట్ 1 ఎండింగ్ లోనే విలన్ అంతమైతే ఇక కథ ఏముంటుంది అనుకోవచ్చు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ సినిమాలో ఒక్కడు, ఇద్దరు కాదు ఏకంగా ఎనిమిది మంది విలన్స్ ప్లాన్ చేశాడట సుకుమార్. ఈ విలన్స్ అందరిని పుష్పరాజ్ ఒక ఆట ఆడుకుంటాడని టాక్. ఇప్పటికే సినిమాలో బోట్ ఫైట్ హైలెట్ గా ఉంటుందని లీకులు రాగా సినిమాపై ఇంకా అంచనాలు పెంచేలా ఈ న్యూస్ వైరల్ గా మారింది.
పుష్ప సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నాడు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమాకు దేవి మ్యూజిక్ కూడా నెక్స్ట్ లెవల్ లో ఉండేలా ఉంటుందని తెలుస్తుంది. పుష్ప రాజ్ తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారుతాడని అంటున్నారు.