తేజ దర్శకత్వం వహించిన "చిత్రం" సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హైదరాబాద్ వాస్తవ్యుడు హీరో ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే సునామీలా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో నుండి వచ్చిన నువ్వు నేను, మనసంతా నువ్వే రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో హ్యాట్రిక్ హీరోగా గుర్తింపు పొందాడు. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న ఉదయ్ కిరణ్ కు అప్పట్లో యూత్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ కుర్ర హీరో సినిమాలపై ఫాన్స్ కి రానురాను అంచనాలు పెరిగిపోయాయి. ఉదయ్ కిరణ్ కూడా సినిమా సినిమాకి డాన్స్ లోనూ, నటనలోనూ కొత్త మెలకువలను కనబరుస్తూ ఆడియన్స్ అంచనాలను అందుకుంటూ వచ్చాడు. తెలుగులోనే కాక తమిళ చిత్రాల్లో కూడా నటించారు ఉదయ్. బాలచందర్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాయ్ చిత్రం ద్వారా తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈ యంగ్ హీరో. ఇలా విజయపథంలో దూసుకుపోతున్న హీరో ఉదయ్ ఒక్కసారిగా ఫ్లాపుల ఊబిలో కూరుకుపోయారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి