ఈ రోజు మన తెలుగు సినిమా పరిశ్రమకు దొరికిన కోట శ్రీనివాసరావు ఎవరి ద్వారా సినిమాల్లోకి ప్రవేశించాడు ? అనేది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. అయితే ఏ విధంగా కోట సినిమాల్లోకి వచ్చాడో ఒకసారి తెలుసుకుందాము. మాములుగా ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కోట శ్రీనివాసరావుకు నాటకాలు అంటే అమితమైన ఇష్టం. ఆ రోజుల్లో నాటకాలకున్న ఆదరణ అటువంటిది. దాదాపుగా బాల్యం నుండే నాటకాలు చేయడం ప్రారంభించిన కోట శ్రీనివాసరావు 20 సంవత్సరాల అనుభవాన్ని గడించాడు.
1978 వ సంవసరంలో కోట శ్రీనివాసరావు "ప్రాణం ఖరీదు" అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్న సమయంలో ఆ నాటకాన్ని తిలకిస్తున్న వారిలో దర్శకుడు మరియు నిర్మాత అయిన క్రాంతి కుమార్ కు ఆ కథ పట్ల అభిమానం పెరిగింది. ఎలాగైనా ఈ నాటకాన్ని సినిమాగా తీయాలని నిశ్చయించుకున్నాడు. అయితే ఇందులో నటీనటులుగా ఈ నాటకంలో నటించిన వారినే తీసుకోవాలనుకోవడం ఆయన గొప్పతనం అనుకోవాలి. అప్పుడు స్వయంగా క్రాంతి కుమార్ అందరినీ ఈ సినిమా గురించి చెప్పి అందులో వారే నటించాలని అడిగాడట, ఇంకేముంది సినిమా అవకాశం వస్తే ఎవరు వదులుకుంటారు చెప్పండి. అలా కోట శ్రీనివాసరావు సినీ రంగ ప్రవేశం జరిగింది. లేకుంటే తెలుగు సినిమా పరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయి ఉండేది. ఈ రోజు కోట శ్రీనివాసరావు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుందాం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి