యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మళ్లీ మేకప్ వేసుకుని షూటింగ్ కు రెడీ అయ్యాడు. ఈసారి సినిమా కోసం కాదు స్మాల్ స్క్రీన్ మీద రియాలిటీ షో కోసం ముఖానికి రంగేసుకున్నాడు ఎన్.టి.ఆర్. తారక్ హోస్ట్ గా జెమిని టీవీలో త్వరలో రాబోతున్న రియాలిటీ షో ఎవరు మీలో కోటీశ్వరుడు. త్వరలో స్టార్ట్ అవుతున్న ఈ షోలో భాగంగా నేటి నుండి ఎన్.టి.ఆర్ షూటింగ్ లో పాల్గొంటున్నారని తెలుస్తుంది. ఈ షో కోసం కంటిన్యూ గా పది రోజుల షూట్ చేస్తారని తెలుస్తుంది. బుల్లితెర మీద ఎన్.టి.ఆర్ సందడి ఆడియెన్స్ కు కొత్తేమి కాదు.

ఆల్రెడీ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బిగ్ బాస్ హోస్ట్ గా మెప్పించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్ గా తారక్ కు 100కి 100 మార్కులు వేశారు తెలుగు ఆడియెన్స్. కేవలం ఒక సీజన్ మాత్రమే హోస్ట్ చేసినా ఎన్.టి.ఆర్ లా మరెవరు చేయలేరు అనేలా మెప్పించాడు. ఇక ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరుడు షూటింగ్ లో జాయిన్ అయ్యాడు ఎన్.టి.ఆర్. అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ షో షూటింగ్ జరుగుతుంది. ఈ షో కోసం తారక్ భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఎవరు మీలో కోటీశ్వరుడు హోస్ట్ గా ఎన్.టి.ఆర్ మరోసారి అదరగొట్టనున్నాడు. స్క్రీన్ ఏదైనా స్క్రిప్ట్ ఏదైనా యంగ్ టైగర్ రెడీ అనేలా తన సత్తా చాటుతాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే ఆర్.ఆర్.ఆర్ దాదాపు షూటింగ్ చివరి దశకు చేరుకోగా త్వరలోనే కొరటాల శివ సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. కొరటాల శివ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని బిగ్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. జనతా గ్యారేజ్ తర్వాత వస్తున్న ఈ కాంబో ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తారని అంటున్నారు. కొరటాల శివ, తారక్ కాంబినేషన్ లో సినిమాకు హీరోయిన్ గా కియరా అద్వానిని ఫిక్స్ చేశారని టాక్.



మరింత సమాచారం తెలుసుకోండి: