అయితే ఈ అంశం కారణం గానే ఆమె షూటింగ్ కి రాలేకపోయింది అని మరొక వార్త వినిపిస్తోంది. ఎప్పటి వరకు ఈమె షోకి రారు. తిరిగి ఎప్పుడు షోకి అటెండ్ అవుతారు అన్న వివరాలపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఇపుడు షోలో నటి శిల్పా శెట్టికి బదులుగా కరిష్మా కపూర్ స్పెషల్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు ప్రస్తుత సమాచారం. ఈ షోలో శిల్పా శెట్టి తో పాటు అనురాగ్ బసు, గీతా కపూర్ లు కూడా జడ్జిలు గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. కాగా శిల్ప తప్ప మిగిలిన ఇద్దరు జడ్జిలు యధావిధిగా షోలో కనిపించి సందడి చేయనున్నారు. అయితే తమ అభిమాన తార శిల్పా శెట్టి ని షోలో బాగా మిస్ అవుతామని, ఆమె లేని లోటు స్పష్టంగా కనబడుతుంది అని చింతిస్తున్నారు ఆమె అభిమానులు. భర్తకు జరిగిన విషయాన్ని జీర్ణించుకోలేక తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని కారణంగానే తన వృత్తిపై కూడా దృష్టి పెట్టలేకపోతోందని తెలుస్తోంది.
శిల్పా శెట్టి హిందితో పాటు తెలుగులోనూ నటిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. హీరో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన "సాహస వీరుడు సాగరకన్య" చిత్రంలో హీరోయిన్ గా నటించి తన అద్భుతమైన నటనతో, తన అందచందాలతో ప్రేక్షకులను తన వైపు తిప్పుకుంది. ఈ సినిమా తెలుగులో ఈమెకు గొప్ప ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. ఈ పొడవు కాళ్ళ సుందరి పేరుకి బాలీవుడ్ నటి అయినప్పటికీ తెలుగు అభిమానుల సంఖ్యను భారీగానే పెంచుకుంది.