మలయాళ సినిమా నుండి ఎంతో మంది భామలు టాలీవుడ్ కి హీరోయిన్ లుగా వచ్చి స్థిరపడ్డారు. అటువంటి వారిలో ఒకరే బొద్దుగా ఉండే నిత్యామీనన్. ఈమె ఒక నటి గానే కాకుండా గాయనిగా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. కొన్ని సినిమాలలో పాటలు పాడి సింగర్ గా కూడా నేను రాణించగలనని నిరూపించుకుంది. ఈమె తెలుగులో 'అలా మొదలైంది' సినిమాతో నాని సరసన నటించి తెలుగు ప్రేక్షకుల మనసుకి దగ్గరయింది. మొదటి సినిమాతోనే తన అమాయకత్వపు నటనతో అటు యువతను ఇటు కుటుంబ ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకుంది. ఈ సినిమా తర్వాత నిత్యాకు ఆఫర్లు వరుసగా క్యూ కట్టాయి. ఇష్క్ మరియు గుండె జారి గల్లంతయిందే సినిమాలు నిత్యామీనన్ ని టాప్ హీరోయిన్ గా నిలబెట్టాయి. ఈ రెండు సినిమాలు నితిన్ తో చేసినవే కావడం గమనార్హం.
ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా ఏవీ తన కెరీర్ లో హిట్ కాలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఒక్క సినిమాతో మళ్ళీ తాను నిత్యం వార్తల్లో నిలుస్తోంది. మలయాళ హిట్ మూవీ అయ్యప్పనుం కోషియమ్ ని తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవన్ కళ్యణ్ మరియు రానాలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ నటించనుందని తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఈ భామను ఏకంగా ఆంటీ గా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నిత్యామీనన్ ను ఒక సినిమాలో అమ్మ పాత్ర కోసం ఒక డైరెక్టర్ అడిగినట్లు తెలుస్తోంది. అయితే నిత్యామీనన్ ఈ వయసులోనే అమ్మ పాత్రలు చేస్తుందా ? లేదా పాత్ర నచ్చితే ఓకే చెబుతుందా ? అంటూ రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఇది కనుక ఓకే అయితే నిత్యామీనన్ కి ఇక అలాంటి పాత్రలే స్వాగతం చెప్పే అవకాశం ఉంది. కానీ ఇంతకు ముందే నిత్యాను అమ్మ పాత్రలను ఆఫర్ చేసినా తిరస్కరించిందని తెలుస్తోంది. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో మొగ్గు చూపుతుందని అనుకుంటున్నారు కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాల్సి ఉంది.  ప్రస్తుతానికి ఇది ఒక గాసిప్ మాత్రమే త్వరలో దీనిపై ఎటువంటి వార్త వస్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: