టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సన్నద్ధం అవుతుంది. మెగా ఫ్యామిలీ హీరోతో అక్కినేని యువ హీరో కలిసి సినిమా చేస్తున్నాడని టాక్. ఇంతకీ ఎవరెవరు ఈ మల్టీస్టారర్ లో ఉంటారని అంటే మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్, అక్కినేని హీరో అఖిల్ ఇద్దరు కలిసి సినిమా చేసే అవకాశం ఉన్నట్టు లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్. ఇద్దరు యువ హీరోలు కలిసి సినిమా చేస్తే ఆ హంగామా ఓ రేంజ్ లో ఉంటుంది. సాయి ధరం తేజ్ దగ్గరకు ఓ న్యూ డైరక్టర్ అదిరిపోయే కథతో వచ్చాడట.

మల్టీస్టారర్ స్టోరీగా వస్తున్న ఈ సినిమాలో సాయి ధరం తేజ్ తో పాటు అక్కినేని హీరోగా నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాడట. త్వరలోనే అఖిల్ దగ్గరకు ఆ డైరక్టర్ ను పంపించి స్టోరీ డిస్కస్ చేసే ఆలోచనలో ఉన్నారట. అఖిల్ కూడా ఓకే చెబితే అక్కినేని మెగా మల్టీస్టారర్ షురూ అయినట్టే. అఖిల్ బ్యాచిలర్ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతుంది. ఓ పక్క సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సినిమా కూడా సెట్స్ మీద ఉంది.

సాయి ధరం తేజ్ కూడా రిపబ్లిక్ రిలీజ్ కు రెడీ అవగా కార్తికేయ డైరక్షన్ లో సినిమాకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం వారు కమిటైన ఈ సినిమాలన్ని పూర్తి చేసి ఇద్దరు కలిసి ఈ మల్టీస్టారర్ సినిమా చేయాలని చూస్తున్నారు. అఖిల్ కి చేయడం కుదరకపోతే నాగ చైతన్య తో అయినా ఈ సినిమా చేయాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్.  ఒకవేళ ఈ కాంబో ఫిక్స్ అయితే అక్కినేని మెగా మల్టీస్టరర్ మూవీ షురూ అయినట్టే. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కు సంబందించిన క్రేజీ అప్డేట్ వస్తుందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్ట్ ను బడా ప్రొడక్షన్ హౌజ్ ప్రొడ్యూస్ చేసే ప్లాన్ లో ఉన్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: